BHPL: జిల్లా SP సంకీర్త్ గౌడ్ ఆదేశాల మేరకు BHPL జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అనుమానస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి రూ.75 వేల విలువైన ఒక కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు CI నరేష్ కుమార్, SI సాంబమూర్తి తెలిపారు. వారిపై కేసు నమోదు చేశారు.