KMM: సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో HPV వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ఎమ్మెల్యే మట్ట రాగమయి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 14 నుంచి 15 సంవత్సరాల వయసు గల ఆడపిల్లలు ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ ఎస్.కె రహేన, కౌన్సిలర్లు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.