AP: శ్రీవారికి అపచారం చేయాలని చూస్తే ఊరుకోనని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ‘మతవిద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమలపై దృష్టి పెట్టాను. గత ప్రభుత్వం తిరుమల పవిత్రత దెబ్బతీసే ప్రయత్నం చేసింది. తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని కూడా కల్తీ చేశారు. రాష్ట్రంలో కల్తీ మద్యం తయారు చేసి వేల మంది చనిపోయేలా చేశారు’ అని విమర్శించారు.