JGL: గ్రామాల్లో పారిశుధ్యం పట్ల నిర్లక్ష్యం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా పంచాయతీ అధికారి చీకోటి మదన్ మోహన్ అన్నారు. బుధవారం పెగడపల్లి మండలం నర్సింహునిపేట గ్రామంలో పారిశుధ్య పనులను డీపీవో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాల్లో రోడ్లు, మురికి కాలువల పరిశుభ్రతను తరచూ చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రేమ్ సాగర్ పాల్గొన్నారు.