BDK: సీతారామ ప్రాజెక్టు పనుల్లో జాప్యం నేపథ్యంలో బుధవారం అధికారులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ములకపల్లి మండలం యాతాలకుంట వద్ద పనులను పరిశీలించిన ఆయన. భూసేకరణ ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. 15 రోజుల్లో టన్నెల్ పనులు పూర్తి చేయాలని, పనులు వేగవంతం చేసి రైతులకు నీరందించాలని అధికారులను ఆదేశించారు.