MDK: కౌడిపల్లి మండలం బుజరాంగ్పల్లిలో పేకాట ఆడుతున్న వారిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు చేసి 9 మందిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించి, 9 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.28,296 నగదు, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.