ADB: చిన్నారులకు ఎప్పటికప్పుడు టీకాలు వేయాలని వైద్యాధికారి సద్దాం అన్నారు. మంగళవారం నేరడిగొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశ కార్యకర్తలు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బపై ప్రతిఒక్కరికి అవగాహన కలిగేలా చూసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో HEO పవార్ రవీందర్, సంతోష్, స్వర్ణలత ఉన్నారు.