NZB: ధర్పల్లి మండల కేంద్రానికి టీజీ పబ్లిక్ స్కూల్ మంజూరు కావడంపై సర్పంచ్ శ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాల్రాజ్ హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ విద్యార్థులకు 1 నుంచి 12వ తరగతి వరకు నాణ్యమైన విద్యనందించేందుకు ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఈ పాఠశాలను కేటాయించారని కొనియాడారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఇది అందుబాటులోకి రానుందని వారు పేర్కొన్నారు.