SRD: వట్పల్లి మండలం పోతులబోగూడ మోడల్ స్కూల్ విద్యార్థి సాయికృష్ణ రూపొందించిన వినూత్న హెల్మెట్ జిల్లా స్థాయి ప్రదర్శనకు ఎంపికైంది. బైక్ వెనుక కూర్చున్న వారు మాట్లాడే మాటలు స్పష్టంగా వినిపించేలా ‘మాగ్నిఫర్వర్’ సాంకేతికతతో దీన్ని తయారు చేశారు. ఈ ఆవిష్కరణతో వాహనదారులు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉండదని,తద్వారా రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని సాయి వివరించారు.