RR: గుడిమల్కాపూర్ మార్కెట్ను, చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలంలోని అజీజ్ నగర్కు తరలించాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అసెంబ్లీలో స్పీకర్ ప్రసాద్ కుమార్ను కోరారు. అజీజ్ నగర్ లోని ప్రభుత్వ స్థలంలో మార్కెట్ ఏర్పాటు చేస్తే చేవెళ్ల నియోజకవర్గంలో శంకర్ పల్లి, మొయినాబాద్, చేవెళ్ల, షాబాద్, నవాబ్ పేట్ మండలాల రైతులకు ఎంతో మేలు కలుగుతుందని అన్నారు.