ADB: జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువులు, ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. జైనథ్ మండలంలోని సాత్నాల ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 286.50మీటర్లు కాగా, ప్రస్తుతం 285.20మీటర్లుగా ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టుకి 100క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉందన్నారు.