SRD: సంగారెడ్డి పట్టణంలో సోమవారం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వర్షం కురవడంతో జనాలకు ఉక్క పోత నుంచి ఉపశమనం కలిగింది. రెండు గంటలకు పైగా వర్షం కురవడంతో పోతిరెడ్డిపల్లి నుంచి పాత బస్టాండ్ వరకు ప్రధాన రహదారి జలమయమైంది. వర్షపు నీటిని మున్సిపల్ సిబ్బంది మురుగు కాల్వని శుభ్రం చేసి తొలగించారు.