CSK స్టార్ క్రికెటర్ MS ధోనీకి ఇదే చివరి IPL సీజన్ కావచ్చని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. ధోనీ లేకుండా CSK జట్టును ఊహించుకోవడం చాలా కష్టమని పేర్కొన్నాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలో CSK ఈసారి టైటిల్ గెలిచి, ధోనీకి ఘనంగా వీడ్కోలు పలకాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించాడు. కాగా, గత కొన్ని ఏళ్లుగా ధోనీకి ఇదే చివరి సీజన్ అంటూ ప్రచారం సాగుతూనే ఉంది.