ఐపీఎల్ 19వ సీజన్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ’19 YEAR LEGACY’ పేరుతో ఐపీఎల్ యాజమాన్యం ధోనీ, రోహిత్, కోహ్లీ, మనీష్ పాండే ఫొటోలను షేర్ చేసింది. ఐపీఎల్ ప్రారంభమైన 2008 నుండి ఇప్పటివరకు ఆడుతున్నది వీరు నలుగురు మాత్రమే కావడం విశేషం. ఈ సీనియర్ల ఆట కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, IPL ప్రారంభం నుంచి కోహ్లీ మాత్రమే ఒకే జట్టు తరఫున ఆడుతున్నాడు.