టీమిండియా మాజీ క్రికెటర్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి రిషభ్ పంత్ను దృష్టిలో ఉంచుకోవాలని తొలుత సూచించినట్లు తెలిపాడు. అయితే, ఇప్పుడు అక్షర్ పటేల్ మంచి ఆప్షన్గా అనిపిస్తోందని పేర్కొన్నాడు. మిడిలార్డర్లో అక్షర్ సరిపోతాడని.. బౌలింగ్ ఆప్షన్ కూడా ఉంటుందని అన్నాడు. రిషభ్ పంత్కు ఛాన్స్లు తక్కువేనని చెప్పుకొచ్చాడు.