ఇంగ్లండ్తో జరిగిన మూడో వన్డేలో 142 పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఒక్కరూ హాఫ్ సెంచరీ చేయలేదు. భారత బౌలర్లలో అర్ష్దీప్, హర్షిత్ రాణా, పాండ్యా, అక్షర్ రెండేసి వికెట్లు సాధించారు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు ఈ విక్టరీ పెద్ద ఊరట అనే చెప్పాలి.