ADB: గాదిగూడ మండలంలోని మారేగావ్ నుంచి భొజ్జుగూడ వరకు ఉన్న బీటీ రోడ్డు ఎన్నో ఏళ్ళ నుంచి అధ్వానంగా మారి రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తోంది. దీంతో బుధవారం నార్నూర్ పర్యటనకు వచ్చిన జిల్లా పాలనాధికారి రాజర్షి షాకు కొలామా సర్పంచ్ రాథోడ్ స్వాతి జగన్నాథ్ వినతి పత్రం అందజేశారు. వీలైనంత త్వరలో దీన్ని మంజూరు చేసి రహదారి నిర్మాణ పనులను ప్రారంభించాలని కోరారు.
CTR: ఐరాలలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని MLA మురళీమోహన్ తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
NZB: పరీక్షలు జరిగే సమయంలో అధికారులు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సీపీ సాయిచైతన్య సూచించారు. నగరంలో ఎస్సెస్సీ పరీక్షలు జరుగుతున్న ఎస్ఎఫ్ఎస్, రవి హైస్కూల్ కేంద్రాలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల చుట్టూ ఎలాంటి జిరాక్స్ సెంటర్లు తెరిచి ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.
KNR: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా సైదాపూర్లో బీజేపీ ఆధ్వర్యంలో తహసీల్దార్ శ్రీనివాస్కు బుధవారం వినతిపత్రం అందజేశారు. మహిళలకు రూ. 2500, రూ. 500కే గ్యాస్, రూ. 4వేల పెన్షన్, యువ వికాసం అమలు చేయకుండా సీఎం రేవంత్ ప్రభుత్వం మోసం చేసిందని మండల అధ్యక్షుడు దెంచనాల శ్రీనివాస్ మండిపడ్డారు. రైతులను దగా చేశారని, వెంటనే హామీలు అమలు చేయాలని కోరారు.
KDP: అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ డివిజన్ కార్యదర్శి షరీఫ్ డిమాండ్ చేశారు. బుధవారం ప్రొద్దుటూరు డిప్యూటీ తహశీల్దార్ సుదర్శన్కు గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏజెన్సీల వారు గ్యాస్ సిలిండర్లను ప్రజలకు కాకుండా వ్యాపారులకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.
SDPT: చిన్నకోడూరు మండలంలోని పలు పాఠశాలల్లో బుధవారం ముందస్తుగా ఉగాది సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలను మామిడి ఆకుల తోరణాలతో అందంగా అలంకరించారు. విద్యార్థుల సమక్షంలో షడ్రుచులతో కూడిన పచ్చడిని తయారు చేసి అందరికీ పంపిణీ చేశారు. తెలుగు సంవత్సరాది ఆవశ్యకత, పచ్చడి వల్ల కలిగే లాభాలను విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరించారు.
SRCL: కోర్టు ఆస్తి దొంగతనం కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ జిల్లా ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ గురువారం తీర్పు వెలువరించారని సిరిసిల్ల సీఐ శ్రీనివాస్ తెలిపారు. సీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 10, 2025న కోర్టు ప్రాంగణంలోని ఎయిర్ కండిషనర్ అవుట్ డోర్ యొక్క రాగి వైరును బహదూర్ సింగ్ దొంగలించాడన్నారు.
SKLM: పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలియజేశారు. ఉగాది పండుగ తనకు ఎప్పుడూ ప్రత్యేకమైనది అని.. తెలుగువారిలో కొత్త ఆనందాలు తెచ్చే పండుగల్లో ఉగాది ఒకటని అన్నారు. ఉగాది పర్వదినాన్ని అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
రణవీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన భారీ స్పై థ్రిల్లర్ మూవీ ధురంధర్ 2 ప్రీమియర్ షోలపై నెలకొన్న డైలమాపై మేకర్స్ స్పందించారు. ఇప్పటికే హిందీ వెర్షన్ ప్రీమియర్ షోలు నడుస్తున్నాయిని.. తమిళ్, తెలుగు ప్రీమియర్ షోలు రాత్రి 9 గంటల నుంచి ప్రారంభవుతాయని ప్రకటించారు. మలయాళం, కన్నడలో రేపు ఉదయం నుంచి షోలు పడతాయన్నారు. కాగా ఈ చిత్రానికి ఆదిత్యధర్ దర్శకత్వం వహించాడు.
KRNL: మండల పరిధిలోని కోతి కొండ గ్రామంలో బుధవారం వడగండ్లతో కూడిన వర్షం కురిసింది. సాయంత్రం 30 నిమిషాల పాటు వడగండ్లతో వర్షం కురిసింది .అలాగే మెరుపులు, ఉరుముల శబ్దంతో పాటు గాలులు వ్యాపించడంతో పొలాల్లో ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడక్కడ మామిడి కాయలు చెట్ల పై నుండి క్రింద పడ్డాయి. దీంతో పలువురు మామిడి రైతులకు నష్టం కూడా వాటిల్లింది.
తిరుపతి SVUలో క్వాంటం టెక్నాలజీ అభివృద్ధిపై సమావేశం జరిగింది. అమరావతి క్వాంటం వ్యాలీ మిషన్ డైరెక్టర్ సీవీ శ్రీధర్ పాల్గొని, 2030 నాటికి అమరావతి ఈ రంగంలో ప్రముఖ కేంద్రంగా మారుతుందని తెలిపారు. VC నర్సింగారావు పరిశోధన అవకాశాల విస్తరణకు వర్సిటీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
WGL: పట్టణ కేంద్రంలోని LB నగర్ క్రిస్టల్ గార్డెన్లో బుధవారం సాయంత్రం కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో ‘ఈద్ కా తోఫా’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిలుగా మంత్రి కొండా సురేఖ, కలెక్టర్ డా. సత్య శారద పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. పండుగలను సోదరభావంతో, ఐక్యతతో జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ముస్లిం పెద్దలు, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.
MBNR: మహబూబ్నగర్ పట్టణంలోని 31వ, 32వ డివిజన్ల పరిధిలో ఉన్న ఎర్రకుంట చెరువును డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, కార్పొరేషన్ కమిషనర్ రామాంజుల రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువును పునరుద్ధరించి, చుట్టూ సుందరీకరణ పనులు చేపట్టి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు.
HYD: హెచ్.ఎల్.ఏలో వెల్ఫేర్ ఫండ్ మేనేజింగ్ కమిటీ ఆధ్వర్యంలో ‘పరాభవ’ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని ఈ.డీ రామ్మోహనరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ ఏడాది కూడా పరిశ్రమ అభివృద్ధికి ఉద్యోగులందరూ ఐకమత్యంతో కృషి చేయాలని ఆయన కోరారు. ఈ వేడుకల్లో జనరల్ మేనేజర్ సతీష్, కర్కా నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
కోనసీమ: వ్యాపారాల్లో బలహీన వర్గాలకు చేయూతనిచ్చే MSMEలకు మద్దతునిస్తూ, బ్యాంకర్లు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. బుధవారం రావులపాలెం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రెవిన్యూ అధికారులతో కలిసి పాల్గొన్నారు. MSMEలు అభివృద్ధి చెందేలా బ్యాంకర్లు సహకారం అందించాలన్నారు.