ASR: ఈనెల 11, 12వ తేదీల్లో జరగనున్న మన్యం బందును జయప్రదం చేయాలని గిరిజన సంఘ నాయకులు సూర్యనారాయణ పోతురాజు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా డుంబ్రిగుడలో ఆదివారం కరపత్రాలు విస్తృతంగా పంచారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆదివాసిల 1/70 చట్టాన్ని సవరించాలని రాష్ట్ర స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు.
VZM: EPS పెన్షనర్లకు కనీసం 9 వేలు ఇవ్వాలని CITU విజయనగరం జిల్లా అధ్యక్షుడు పి.శంకరరావు ఆదివారం డిమాండ్ చేశారు. ఈ మేరకు బొబ్బిలి CITU కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కనీస పెన్షన్ కోసం గత కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని ఈ నేపథ్యంలో ఈనెల 11న విజయనగరం PF కార్యాలయం వద్ద ధర్నా చేపట్టలని నిర్ణయించామన్నారు.
RR: నార్సింగి పరిధిలోని మేకన్ గడ్డ వద్ద జరిగిన ప్రమాదంలో వైద్యుడు యశ్వంత్ మృతి చెందగా.. వైద్యురాలు భూమిక తీవ్ర గాయాల పాలైన విషయం తెలిసిందే. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా భూమికకు బ్రెయిన్ డెడ్ అయింది. నలుగురి జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో గుండె, లివర్, కళ్లు, కిడ్నీలను దానం చేశారు. కూతురు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
NTR: కంచికచర్ల పట్టణ పరిధిలోని పోలీస్ స్టేషన్లో ఏసీపీ తిలక్ ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న యువతిపై అత్యాచార ఘటనపై కేసు నమోదు చేశామని చెప్పారు. హుస్సేన్ అనే వ్యక్తి ఆమెను ప్రేమ పేరుతో తన స్నేహితుడైన సిద్దు ఇంటికి తీసుకువెళ్లగా.. సిద్దు అత్యాచారం చేసినట్లు తెలిపాడు. అదే విధంగా ఈ కేసులో ఒకరిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.
HYD: నగర శివార్లలోని ORR పై రాత్రివేళ ఆకతాయిలు హల్చల్ చేస్తూ ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రమాదకరంగా కారు రేసింగులు, స్టంట్లు చేస్తూ హంగామా చేస్తున్నారు. శంషాబాద్ సమీపంలో ఔటర్పై ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డవడంతో.. స్టంట్లు చేసిన యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
RR: చేవెళ్ల మండలం పామెన గ్రామంలో దుర్గమ్మ, మైసమ్మ, సరోజనమ్మ దేవతల విగ్రహ ప్రతిష్టాపనల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
SKLM: కార్మికులను నిర్బంధించి పని చేయించటం చట్ట రీత్యా నేరమని శ్రీకాకుళం అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వై. శైలేశ్ కుమార్ అన్నారు. వెట్టి చాకిరి నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఆదివారం స్థానిక ఎన్జీఓ హోమ్ వద్ద ర్యాలీ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులను నిర్ణీత పని గంటల తర్వాత స్వేచ్ఛగా తాము జీవించే హక్కుందని సూచించారు.
VZM: చీపురుపల్లి మేజర్ పంచాయతీలో వెలసిన ఉత్తరాంధ్ర కల్పవల్లిగా పూజించే శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి జాతరకు తొలి ఘట్టం మొదలైంది. ఆలయ ప్రాంగణంలో ఈవో బి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆదివారం ముహూర్తపురాట వేశారు. ఈవో మాట్లాడుతూ.. మార్చి నెల 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు అమ్మవారి జాతరను నిర్వహిస్తున్నామన్నారు. జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
మేడ్చల్: మేడ్చల్ పట్టణంలోని శ్రీ దాక్షాయణి సమేత రామలింగేశ్వర కల్యాణ మహోత్సవం ఈనెల 26న జరుగనున్న సందర్భంగా ఆలయ సమీపంలోని నిర్మాణంలో ఉన్న రైల్వే అండర్ పాస్ నిర్మాణాన్ని 25లోగా ప్రారంభించాలని పట్టణ నాయకులు కాంట్రాక్టర్కు సూచించారు. శనివారం రైల్వే అండర్ పాస్ నిర్మాణ పనులను కాంట్రాక్టర్ వెంకన్నతో కలిసి పరిశీలించారు.
ఢిల్లీ కొత్త సీఎం పేరు ప్రకటనపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ కానుంది. ఇప్పటికే అమిత్ షా, నడ్డాతో ప్రధాని మోదీ చర్చలు జరిపారు. కాగా సీఎం రేసులో పర్వేష్ వర్మ ముందున్నారు. అయితే రేపటి నుంచి ప్రధాని విదేశీ పర్యటన ఉండగా, దాని కంటే ముందే ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎంపికపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ATP: కూటమి ప్రభుత్వం పేదల పక్షాన నిలబడుతున్న ప్రభుత్వమని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం టీడీపీ కార్యాలయంలో 8వ విడత సీఎంఆర్ ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం ఆర్ఎఫ్ విషయంలో ఉదారంగా స్పందిస్తున్న సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఛతీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. బీజాపూర్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డారు. డీఆర్జీ, ఎస్టీఎఫ్ దళాలు మావోయిస్టుల కోసం గాలిస్తున్నాయి.
బాపట్ల: గ్రామాల్లో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటాయని ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు పేర్కొన్నారు. వేమూరు గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత మెగా కంటి వైద్య శిభిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకున్నారు. అలాగే గ్రామంలోని ప్రజలకు వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించారు.
ప్రకాశం: పామూరు మండలంలోని ఊరకొండ వద్ద ఉన్న మట్టి కుప్పల పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమయింది. అతను సుమారు 2, 3 రోజుల క్రితం మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యక్తికి 60 నుంచి 65 సంవత్సరాల వయసు ఉంటుంది. కనిగిరి గవర్నమెంట్ వైద్యశాలకు మృతదేహాన్ని తరలించామని పోలీసులు తెలిపారు.
పల్నాడు: పెదకూరపాడులో ఆదివారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పై మండల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ పరిశీలకులు కెకె. చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ని అత్యధిక మెజారిటీతో గెలిపించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.