• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

చిలకలడోనలో నిల్వ చేసిన గడ్డివాము దగ్ధం

KRNL: మంత్రాలయం మండలంలోని చిలకలడోన గ్రామంలో శనివారం గడ్డివాము దగ్ధమైంది. మాజీ MPTC డీపీ గోవిందమ్మ, రాఘవేంద్ర గ్రామ శివారులో పశుగ్రాసం నిల్వ చేసిన గడ్డివాములో మంటలు అంటుకున్నాయి. గ్రామస్తులు అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చి, నీటిట్యాంకర్లు, JCB యంత్రాలతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పశుగ్రాసం పూర్తిగా కాలిపోయింది.1.5 లక్షల నష్టం జరిగిందన్నారు.

February 9, 2025 / 07:22 AM IST

గుణదల పార్కింగ్ స్థలాలు

కృష్ణా: విజయవాడ గుణదల ఉత్సవాల సందర్భంగా పార్కింగ్ స్థలాలను పోలీసులు తెలిపారు. విజయవాడ సిటీ, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట, హైదరాబాద్ నుంచి వచ్చేవారికి BRTS ROADలో, గన్నవరం, మచిలీపట్నం, ఏలూరు, పడమట వైపు నుంచి వచ్చే వారికి జీఎన్ బైబిల్ కాలేజ్ మైదానం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం, ESI హాస్పిటల్ మైదానం పార్కింగ్ సౌకర్యం కల్పించినట్లు పోలీసులు తెలిపారు.

February 9, 2025 / 07:11 AM IST

ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న ఎమ్మెల్యే

NTR: జగ్గయ్యపేట పట్టణంలోని చిల్లకల్లు రోడ్డులో క్రైస్తవ ఉజ్జీవ మహాసభలకు శనివారం జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తాతయ్య మాట్లాడుతూ.. ఏసుక్రీస్తు మార్గం ప్రతి ఒక్కరికి ఆదర్శమన్నారు. ప్రేమ, శాంతి, కరుణ, క్షమాపణ, తదితర ఉత్తమ గుణాలను ప్రతి ఒక్కరూ పెంపొందించేందుకు ఈ మహోత్సవాలు దోహదపడతాయని అన్నారు.

February 9, 2025 / 07:10 AM IST

‘రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచాలి’

PDPL: ముత్తారం మండలం కేశనపల్లి గ్రామంలోని ఫర్టిలైజర్ షాపును మండల వ్యవసాయ అధికారి అనూష శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫర్టిలైజర్ దుకాణంలోని రికార్డులు పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గోదాములలో నిలువలను పరిశీలించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులను అందుబాటులో ఉంచాలని నిర్వాహకులకు సూచించారు.

February 9, 2025 / 06:44 AM IST

మందకృష్ణ మాదిగను కలిసిన కె.ఎస్.జవహర్

E.G: పద్మశ్రీ అవార్డు పొందిన మాన్యశ్రీ మంద కృష్ణ మాదిగ శనివారం హైదరాబాద్‌లో రాజమహేంద్రవరం పార్లమెంట్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మాజీ మంత్రి కె.ఎస్ జవహర్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మందకృష్ణ మాదిగతో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితిపై జవహర్ చర్చించటం జరిగింది.

February 9, 2025 / 06:31 AM IST

పలు అభివృద్ధి పనులకు మంత్రి భూమి పూజ

NGKL: కొప్పునూరు గ్రామంలో శనివారం మంత్రి జూపల్లి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనానికి రూ.20 లక్షలు, ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల కింద రూ.50 లక్షల సీసీ రోడ్, వడ్డెర కమ్యూనిటీ భవనానికి రూ.5 లక్షలతో నిర్మించనున్న పలు  భవనాలకు భూమి పూజ చేశారు. అనంతరం ఎస్సీ కాలనీ పోచమ్మ గుడిని సందర్శించారు.

February 9, 2025 / 05:42 AM IST

‘PGRS కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోండి’

NDL: అవుకు మండల కేంద్రంలోని స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో నంద్యాల కలెక్టర్ జీ.రాజకుమారి ఆదేశాల మేరకు ఈనెల 10న ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS) కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తహశీల్దార్ కార్యాలయ అధికారులు తెలిపారు. మండల పరిధిలోని ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

February 9, 2025 / 04:51 AM IST

లోన్‌లు ఇప్పిస్తానని మూడు కోట్లకు టోకరా

JGL: ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్ గ్యారంటీ ప్రోగ్రాం కింద కోటి రూపాయల వరకు ముద్ర లోన్‌లు ఇప్పిస్తానంటూ దాదాపు రూ.3 కోట్లు కాజేశారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్‌కు చెందిన నిందితుడు వేణు వర్మను బాధితులు శనివారం తీన్ ఖని ప్రాంతానికి చెందిన ఓ ఇంటి వద్ద పట్టుకుని జగిత్యాల టౌన్ పోలీసులకు అప్పగించారు. ఈ స్కామ్‌లో జిల్లాలో వంద మందికి పైగా బాధితులు ఉన్నారు

February 9, 2025 / 04:07 AM IST

BREAKING: రేషన్ కార్డుల దరఖాస్తులపై క్లారిటీ

TG: ‘మీ సేవ’ ద్వారా కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణపై నెలకొన్న గందరగోళానికి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. మీ సేవ ద్వారా రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరించడం లేదని.. దరఖాస్తులు తీసుకోవాలని పేర్కొంటూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని స్పష్టం చేసింది. ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులను ఆన్‌లైన్ చేయిస్తున్నామని.. దరఖాస్తులను ఆన్‌లైన్ చేయాలని మాత్రమే ‘మీసేవ’ను కోరినట్లు...

February 8, 2025 / 08:19 PM IST

మారుమూల గ్రామాలకు రహదారి నిర్మాణం

ASR: ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని టీడీపీ కొయ్యూరు మండల కార్యదర్శి దొరబాబు అన్నారు. శనివారం ఆయన కన్నవరం గ్రామంలో పర్యటించారు. కన్నవరం నుంచి వంతమర్రి, పిట్టలపాడు, గరిమండ వరకూ జరుగుతున్న రహదారి నిర్మాణ పనులు పరిశీలించారు. ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల్లోనే మారుమూల గ్రామాలకు రహదారి నిర్మాణం జరుగుతుందన్నారు.

February 8, 2025 / 08:16 PM IST

సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి

ASR: కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ ఏవీ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం పాడేరులో ఉద్యోగుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరారు. ప్రభుత్వం నిన్న విడుదల చేసిన జీవో నెంబర్-2 వల్ల ఉద్యోగుల్లో తీవ్ర అసమానతలు ఏర్పడతాయని తెలిపారు.

February 8, 2025 / 07:38 PM IST

విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న కడప ఎంపీ

KDP: వేంపల్లి మండలలోని కుప్పాలపల్లెలో తాళ్లపల్లి శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో నూతన ధ్వజస్తంభ, నూతన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాల్లో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఆలయ నిర్వాహకులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఎంపీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఎంపీకి తీర్థ ప్రసాదాలు అందజేసి దుశ్శాలువాతో సత్కరించారు.

February 8, 2025 / 07:35 PM IST

చిన్న పరిశ్రమలకు ప్రభుత్వం ప్రోత్సాహం: మంత్రి

VZM: పూసపాటిరేగ మండలం కొప్పెర్ల గ్రామంలో రోటర్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ రీ సైక్లింగ్ యూనిట్‌ను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ చిన్న పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే లోకం మాధవి, మార్క్ ఫెడ్ ఛైర్మన్ కర్రోతు బంగార్రాజు తదితరులు పాల్గొన్నారు.

February 8, 2025 / 07:31 PM IST

యాదాద్రి శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు జస్టిస్

BNGR: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని శనివారం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుజయ్ పాల్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి పూర్ణకుంభంతో ఆలయ పండితులు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం స్వామివారి చిత్రపటం తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భాస్కరరావు జిల్లా కలెక్టర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

February 8, 2025 / 07:18 PM IST

నిరుపేదల ఆరోగ్యానికి సీఎం సహాయనిధి‌ భరోసా: ఎమ్మెల్యే

VZM: వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి చెక్కులను రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్‌ శనివారం అందజేశారు. అనారోగ్యానికి గురై చికిత్స పొందిన గెంబలి విమల కుమారికి రూ. 4,01,137 పెనుబాక గ్రామానికి చెందిన చీడి జగన్నాథానికి రూ. 2,63,124 చెక్కులను అందబేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుపదల ఆరోగ్యానికి భరోసాగా సీఎం సహాయనిధి నిలుస్తుందన్నారు.

February 8, 2025 / 06:50 PM IST