తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని హాథీరాంజీ మఠం మహంతు అర్జున్ దాస్ దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం మహంతుగా నియమితులైన అర్జున్ దాస్కు మఠం ప్రాంగణంలో ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ ఎంటీవో కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ కేశవులు, లా ఆఫీసర్ లక్ష్మీ స్వాములు సనక్ దాస్, కృష్ణ దాస్, మాధవ దాస్ తదితరులు పాల్గొన్నారు.
JGL: కథలాపూర్ మండలం పోసానిపేట, చింతకుంట గ్రామాల్లో 30 లక్షలతో నిర్మిస్తున్న మూడు మహిళా సమైక్య సంఘం నూతన భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని, మహిళా సమైక్య సంఘాల బలోపేతం ద్వారా కుటుంబాల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని అన్నారు.
KRNL: ఆదోని మండలం పెద్దతుంబలంలో గురువారం విద్యుత్ ప్రమాదం జరిగింది. బీసీ కాలనీలో తలారి నాగరాజు ఇంటి వద్ద లైట్ పోల్ జంపర్ మరమ్మతులు చేస్తుండగా షార్ట్ సర్క్యూట్ కారణంగా విద్యుత్ కార్మికుడు హెచ్.ఉసేని గాయపడ్డాడు. అతడిని వెంటనే ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. తమ అనుమతి లేకుండా పని చేసినట్లు లైన్మెన్, సబ్స్టేషన్ సిబ్బంది తెలిపారు.
TG: ఖమ్మం జిల్లా వాసుల దశాబ్దాల కల నెరవేరబోతోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చొరవతో.. జిల్లాలోని ఐదు ప్రధాన రహదారుల విస్తరణకు రూ.594 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులతో కీలక మార్గాలను నాలుగు వరుసల రహదారులుగా అభివృద్ధి చేయనున్నారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ పద్ధతిలో వీటి నిర్మాణం చేయనున్నారు.
KMM: సత్తుపల్లి మండలం రామానగరంలో పండుగ వేళ విషాదవం చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగారం 15వ బెటాలియన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న బుద్ధ శ్రీనివాసరావు (50) గుండెపోటుతో మృతి చెందాడు. శ్రీనివాసరావు మృతి పట్ల సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, పోలీస్ సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు.
NZB: ఆర్మూర్ మండలంలోని గోవింద్ పేట్ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, పురోహితుడితో పంచాంగ శ్రవణం చేయించారు. అనంతరం భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అప్పల గణేష్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు, సభ్యులు గ్రామప్రజలు పాల్గొన్నారు.
KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1న జరగనున్న సీతారాముల కళ్యాణానికి రాష్ట్ర గవర్నర్ S.అబ్దుల్ నజీర్ను టీటీడీ AEO వెంకయ్య చౌదరి ఆహ్వానించారు. ఆలయ అర్చకుల మంత్రోచ్చారణల నడుమ గవర్నర్కు ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇంఛార్జ్ DEO శివప్రసాద్, అర్చకులు పాల్గొన్నారు.
అన్నమయ్య: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి-శ్రీమతి భారతి రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచాంగ శ్రవణం నిర్వహించగా, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి పాల్గొని అధినేతకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
యాదాద్రి: చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ బాలాజీ రామకృష్ణ దేవస్థానంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా లింగారెడ్డిగూడెం వాస్తవ్యులైన IPS అధికారిణి సురకంటి శేషాద్రి రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ఆమెను శాలువాతో ఘనంగా సత్కరించి, ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
కృష్ణా: గుడివాడ టిడ్కో గృహ లబ్ధిదారులకు మున్సిపల్ కమిషనర్ మనోహర్ ఈరోజు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 8,904 మందికి ఇళ్లు కేటాయించగా, 950 మందికి ఇళ్ల కేటాయింపు పూర్తయినా రుణాల మంజూరులో జాప్యం జరుగుతోందన్నారు. వీరిలో ఇప్పటివరకు కేవలం 228 మంది మాత్రమే రుణ సౌకర్యం పొందారున్నారు. మిగిలిన లబ్ధిదారులు ఈ నెల 31 లోపు రుణాలు మంజూరు చేయించుకోవాలన్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 2,496.89 పాయింట్లు నష్టపోయి 74207.24 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 775.65 పాయింట్ల నష్టంతో 23002.15 దగ్గర ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 92.41గా ఉంది. పశ్చిమాసియా యుద్ధం ప్రభావంతో స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి.
PLD: ఈపూరు మండలం ముప్పాళ్ళ గ్రామంలోని శిరిడీ సాయిబాబా దేవాలయంలో వార్షికోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు అర్చకులు, గ్రామస్తులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
NGKL: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు గురువారం కల్వకుర్తి పట్టణంలోని శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. RSS వ్యవస్థాపకుడు డా. కేశవ్ బాలిరామ్ హెడ్గేవార్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు అర్పించి నివాళులు ఘటించారు. అనంతరం ఉగాది వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు దుర్గ ప్రసాద్ పాల్గొన్నారు.
KRNL: క్రిష్ణగిరి మండలం కటారుకొండలో శ్రీ గుంటి రంగస్వామి తిరునాల సందర్భంగా గ్రామంలో భక్తి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఈ.శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు టీడీపీ కార్యకర్తలు గ్రామ ప్రజలకు ఉచిత మజ్జిగ పంపిణీ చేశారు. వేసవి వేడిని దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై సేవలను వినియోగించుకున్నారు.
TG: మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని TPCC చీఫ్ చేస్తే వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు వస్తాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపుతున్నాయి. మంత్రి వ్యాఖ్యలు బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వాన్ని కించపరచడమేనని మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? అని ప్రశ్నించారు.