MBNR: భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జియంఆర్ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు చదివి, సమాజానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, పేదరికం నిర్మూలనకు చదువు ఒక ఆయుధమని అన్నారు.