కోనసీమ: శ్రీరామనవమి సందర్భంగా అమలాపురం నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ చల్లా సత్యనారాయణ మూర్తి శుక్రవారం తెలిపారు. 5వ తేదీ శనివారం ఉదయం 8:30 నుంచి రాత్రి 8:30 వరకు భధ్రాచలంకు ప్రత్యేక బస్సులు తిరుగుతాయన్నారు. తిరిగి 6వ తేదీ స్వామి వారి కళ్యాణం అనంతరం మధ్యాహ్నం 1:00 గంట నుండి అందుబాటులో ఉంటాయన్నారు.