• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మొక్కజొన్న కొనుగోలు చేయాలని సీపీఐ(ఎంఎల్)ధర్నా

MHBD: బయ్యారం మండల కేంద్రంలో సీపీఐ(ఎంఎల్) ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించి మొక్కజొన్నను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మార్కెట్‌లో క్వింటాకు కేవలం రూ.1,600–1,700 మాత్రమే లభించడం వల్ల రైతులు తీవ్ర నష్టంలో ఉన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య తెలిపారు.

March 18, 2026 / 07:40 PM IST

‘రీసైక్లింగ్‌తో స్వచ్ఛ సూర్యాపేట సాధ్యం’

SRPT: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని మున్సిపల్ ఛైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి అన్నారు. ఇళ్ల వద్దనే తడి, పొడి వ్యర్థాలను వేరు చేయడం ద్వారా రీసైక్లింగ్ ప్రక్రియ సులభతరం అవుతుందని అన్నారు. ప్రపంచ రీసైక్లింగ్ దినోత్సవం సందర్భంగా సూర్యాపేట మున్సిపాలిటీకి సంబందించిన జమునా నగర్ ప్లాస్టిక్ రీసైక్లింగ్ కేంద్రాన్ని ఆమె సందర్శించారు.

March 18, 2026 / 07:40 PM IST

విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం

కృష్ణా: ఘంటసాలలోని శ్రీకాకుళంలో పునర్నిర్మిత శ్రీ హనుమత్ లక్ష్మణ పరివార సమేత సీతారామ స్వామి దేవస్థానంలో మార్చి 19 నుంచి 21 వరకు విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ను ఎంపీటీసీ చిన్నా, ఆలయ కమిటీ సభ్యులు బుధవారం ఆహ్వానించారు. మూడు రోజులపాటు పూజలు, హోమాలు, ప్రతిష్ఠ, అన్నదానం జరగనున్నాయి.

March 18, 2026 / 07:40 PM IST

’15 రోజులుగా పొంగుతోన్నా పట్టించుకోవడం లేదు’

వికారాబాద్ 15వ వార్డు సాకేత్ నగర్ SIC కార్యాలయం సమీపంలో 15 రోజులుగా డ్రైనేజీ పొంగి రోడ్లపై పారుతోంది. దుర్వాసనతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే లీకేజీలను అరికట్టి పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని వారు కోరుతున్నారు.

March 18, 2026 / 07:39 PM IST

నవోదయ ప్రవేశ పరీక్షల్లో మెరిసిన బాపులపాడు విద్యార్థులు

కృష్ణా: నవోదయ ప్రవేశ పరీక్షల ఫలితాల్లో బాపులపాడు విద్యార్థులు మెరిశారు. నవోదయ విద్యాలయ సమితి ఆరో తరగతి ప్రవేశానికి నిర్వహించిన పరీక్షల్లో బాపులుపాడుకు చెందిన దేవాన్ష్ మౌనిష్, స్టాన్లే ప్రతిభ కనబరిచి ఆరో తరగతి ప్రవేశానికి ఎంపికయ్యారు. పాఠాలు బోధించిన ఉపాధ్యాయులు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో విద్యార్థుల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

March 18, 2026 / 07:38 PM IST

వలిగొండలో ప్రపంచ శాంతిని కోరుతూ ర్యాలీ

BHNG: వలిగొండ మండల కేంద్రంలో ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికాలు చేస్తున్న దాడిని నిరసిస్తూ ప్రపంచ శాంతి ర్యాలీని బుధవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ శాంతిర్యాలీకి సీపీఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి అధ్యక్షత వహించారు. అమెరికా తన సామ్రాజ్యవాద కాంక్షతో ఇతర దేశాలతో యుద్ధంను ప్రోత్సహిస్తుందని విమర్శించారు.

March 18, 2026 / 07:37 PM IST

పరీక్ష కేంద్రాలను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్

కరీంనగర్‌లోని సప్తగిరి కాలనీలో ప్రభుత్వ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్ష కేంద్రాలను బుధవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. అధికారులు సిబ్బందితో మాట్లాడారు. పరీక్షల నిర్వహణలో ఏమైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా వసతులు సక్రమంగా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.

March 18, 2026 / 07:35 PM IST

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉగాది వేడుకలు

MULG: ఏటూరునాగారం మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ఉగాది సందర్భంగా ముందస్తుగా ఘనంగా వేడుకలు నిర్వహించబడ్డాయి. తెలుగు విభాగం ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి ప్రిన్సిపల్ నవీన్ అధ్యక్షత వహించారు. విభాగాధిపతి కె. సంపత్ విద్యార్థులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపి, పండుగ ప్రాముఖ్యతను వివరించారు.

March 18, 2026 / 07:34 PM IST

లో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే

NGKL: నాగర్ కర్నూల్ పట్టణంలోని పలువార్డుల్లో నెలకొన్న లో వోల్టేజీ సమస్య పరిష్కరించేందుకు అదనంగా ట్రాన్స్‌ఫార్మర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలో నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని నాల్గవ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

March 18, 2026 / 07:33 PM IST

‘ప్రకృతి వ్యవసాయంతో నాణ్యమైన పంట ఉత్పత్తులు’

MNCL: ప్రకృతి వ్యవసాయం ద్వారా నాణ్యమైన, ఆరోగ్యకరమైన పంట ఉత్పత్తులను సాధించవచ్చని DAO సురేఖ అన్నారు. బుధవారం జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ కింద ఎంపికైన తాండూర్ మండలం గోపాల్ నగర్ రైతులకు ఆమె అవగాహన కల్పించారు. సేంద్రియ సాగు పద్ధతులను వివరిస్తూ రసాయనిక ఎరువులు లేని ఆహారంతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలన్నారు.

March 18, 2026 / 07:33 PM IST

ప్రగతి ఎనక్లేవ్ పార్కులో అభివృద్ధి పనుల పరిశీలన

RR: మియాపూర్ డివిజన్ ప్రగతి ఎనక్లేవ్ కాలనీ పార్కులో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను తాజా మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ సందర్శించారు. జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పనుల నాణ్యతను, పురోగతిని ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అట్టేపల్లి రామప్రభు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

March 18, 2026 / 07:33 PM IST

కొబ్బరి అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలి: ఎంపీ

KMM: తెలంగాణ రాష్ట్రంలో 3,300 ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతుండగా భద్రాద్రి, ఖమ్మం జిల్లాలో అధిక విస్తీర్ణం ఉన్నట్లు ఎంపీ రఘురాం రెడ్డి తెలిపారు. అశ్వరావుపేట, దమ్మపేటలో కొబ్బరి అభివృద్ధి బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఈరోజు పార్లమెంట్ సమావేశాల్లో కోరారు. రైతులకు సాంకేతిక సహాయం, నాణ్యమైన సాగు, మార్కెట్ అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు.

March 18, 2026 / 07:32 PM IST

ఇంటర్ విద్యార్థి అదృశ్యం.. కేసు నమోదు

ELR: కళాశాలకు వెళ్లిన ఓ ఇంటర్ విద్యార్థిని అదృశ్యమైన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. జీలుగుమిల్లికు చెందిన విద్యార్థిని అశ్వారావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతోంది. 3రోజుల క్రితం కళాశాలకు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో తల్లి ఫిర్యాదు మేరకు ఎస్సై వి. క్రాంతి కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

March 18, 2026 / 07:31 PM IST

‘కాంగ్రెస్ హయాంలో మైనార్టీలకు సముచిత గౌరవం’

MBNR: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మైనార్టీలకు సముచిత గౌరవం లభిస్తుందని మహబూబ్ నగర్ మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్ అన్నారు. బుధవారం రంజాన్ పండుగను పురస్కరించుకుని MBNR కార్పొరేషన్ పరిధిలోని 37వ డివిజన్లో మైనార్టీలకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. కులమతాలకతీతంగా ప్రజలంతా కూడా సంతోషంగా పండగలు జరుపుకోవాలని అన్నారు.

March 18, 2026 / 07:31 PM IST

ప్రశాంతంగా పండగలు జరుపుకోవాలి: సీఐ

MDK: ప్రజలు పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి అన్నారు. పెద్ద శంకరంపేట పోలీస్ స్టేషన్‌లో రంజాన్, ఉగాది, శ్రీరామనవమి పండుగ పురస్కరించుకొని ప్రజలకు పలు సూచనలు చేశారు. కులమతాలకు అతీతంగా సోదరభావంతో పండుగలను జరుపుకోవాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని సీఐ సూచించారు. పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన్నారు.

March 18, 2026 / 07:30 PM IST