SKLM: మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని రణస్థలం సర్పంచ్ భానోజీ నాయుడు పేర్కొన్నారు. శనివారం ఉదయం రణస్థలం గ్రామంలోని కరిమజ్జి వీధిలో సర్పంచ్ నేతృత్వంలో పంచాయతీ అధికారులు సమక్షంలో పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. వీధుల్లో కాలువలను శుభ్రం చేయించారు. తడి-పొడి చెత్తను వేరువేరుగా ఉంచి, పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలని సూచించారు.