శ్రీకాకుళం: నగరపాలక సంస్థ పరిధిలో గృహ యజమానులు, వాణిజ్య సముదాయ యజమానులు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను బకాయిలను చెల్లించాలని నగరపాలక సంస్థ కోరింది. ఈ నెల 30లోగా చెల్లించాలని, లేకుంటే మే నెల నుంచి అదనంగా 2% వడ్డీ విధిస్తామన్నారు. దీనిపై నగరంలోని పలు వీధుల్లో ఆటోతో అవగాహన కల్పించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.