• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

చెరువులన్నీ నింపాలని ప్రభుత్వ విప్‌కు వినతి

BHNG: రాజాపీట మండలంలోని చెరువులన్నీ నింపాలని కోరుతూ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు రైతు జేఏసీ నాయకులు ఆదివారం గాంధీ చౌరస్తాలో వినతి పత్రం అందజేశారు. కొత్తగా ఎస్టిమేషన్ వేసిన తర్వాత చెరువులన్నీ నింపేందుకు ప్రయత్నం చేయనున్నట్లు బీర్ల ఐలయ్య తెలిపారు. కాలయాపన చేయకుండా పంటలు ఎండిపోక ముందే చెరువులు నింపాలని రైతు జేఏసీ నాయకులు కోరారు.

February 9, 2025 / 04:42 PM IST

తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

NLG: కొడుకులు లేని తండ్రికి కూతురే అన్ని తానే తలకొరివి పెట్టింది. ఈ సంఘటన ఆదివారం పెన్ పహాడ్ మండలం చీదెళ్ల గ్రామంలో చోటుచేసుకుంది గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు రగోతంరెడ్డి శనివారం రాత్రి మృతి చెందారు. ఆయనకు ఇద్దరు కూతుర్లు సంతానం కావడంతో పెద్ద కూతురు శృతి ఆదివారం తండ్రికి కొడుకుల తలకొరివి పెట్టి తండ్రి రుణం తీర్చుకుంది.

February 9, 2025 / 04:31 PM IST

SA T20 ఛాంపియన్స్‌గా ఎంఐ కేప్‌టౌన్

SA T20 లీగ్‌‌లో ఎంఐ కేప్‌టౌన్ విజేతగా నిలిచింది. సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌తో జరిగిన ఫైనల్లో 76 పరుగుల తేడాతో విజయం సాధించింది. 181 పరుగుల లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌​ 18.4 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఎంఐ తొలిసారి SA20 ఛాంపియన్స్‌గా అవతరించింది. మార్కో జాన్సెన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు.

February 9, 2025 / 02:23 PM IST

డీవార్మింగ్ డేకు సహకరించాలి

VZM: రేగిడి మండలం రేగిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి గ్రామాల్లో ఈనెల 10న డీ వార్మింగ్ నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి డా.అసిరినాయుడు ఆదివారం తెలిపారు. ఫిబ్రవరి 10 నుంచి అంగన్వాడీ, పాఠశాల, కళాశాలల్లో విద్యార్థులకు డీవార్మింగ్ మాత్రలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. 2 ఏళ్ల లోపు పిల్లలు అర మాత్ర, 3-19 ఏళ్ల వాళ్లు ఒక మాత్ర వాడాలన్నారు.

February 9, 2025 / 02:17 PM IST

‘ఆటలతో శారీరక ఉత్సాహం’

W.G: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇస్తాయని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపన చౌదరి అన్నారు. వచ్చే నెలలో ఏలూరులో జరిగే స్నేహం మెమోరియల్ క్రికెట్ క్లబ్ వారి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మిత్రుల పేరు మీద క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న నిర్వాహకుల దృక్పథం అభినందనీయమని తపన చౌదరి పేర్కొన్నారు.

February 9, 2025 / 02:13 PM IST

అనుమానాస్పద స్థితిలో కార్మికుడు మృతి

మేడ్చల్: అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన మేడ్చల్ పీఎస్ పరిధిలో జరిగింది. పట్టణంలోని కిష్టాపూర్ రోడ్డులో ఉన్న జమున వెంచర్లాట్ నెంబరు 33లో ఆర్మూర్ శ్రీనాథ్ అనే వ్యక్తి మూడేళ్ల కిందట కృష్ణవేణి సిమెంట్ వర్క్ పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించారు. శ్రీనాథ్ వెనుక భాగంలో బలమైన గాయాలు ఉండటంతో సహచర కార్మికుడు రాజును పోలీసులు విచారిస్తున్నారు.

February 9, 2025 / 01:34 PM IST

హిందీ ప్రాథమిక పరీక్షలు నిర్వహణ

VZM: వేపాడలోని విక్టరీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఆదివారం దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఆధ్వర్యంలో హిందీ పరిచయ మరియు ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షకు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. పాఠశాల అడ్మిన్ డైరెక్టర్ రాఘవ మాట్లాడుతూ.. ఈ పరీక్షలు హిందీ భాష నేర్చుకోవడానికి అలాగే హిందీ పండిట్ కావడానికి ఎంతగానో దోహదపడతాయని తెలిపారు.

February 9, 2025 / 01:33 PM IST

మన్యం బంద్ జయప్రదం చేయాలి

ASR: ఈనెల 11, 12వ తేదీల్లో జరగనున్న మన్యం బందును జయప్రదం చేయాలని గిరిజన సంఘ నాయకులు సూర్యనారాయణ పోతురాజు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా డుంబ్రిగుడలో ఆదివారం కరపత్రాలు విస్తృతంగా పంచారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆదివాసిల 1/70 చట్టాన్ని సవరించాలని రాష్ట్ర స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు.

February 9, 2025 / 01:23 PM IST

‘ఈ నెల 11న పీఎఫ్ కార్యాలయం వద్ద ధర్నా’

VZM: EPS పెన్షనర్లకు కనీసం 9 వేలు ఇవ్వాలని CITU విజయనగరం జిల్లా అధ్యక్షుడు పి.శంకరరావు ఆదివారం డిమాండ్ చేశారు. ఈ మేరకు బొబ్బిలి CITU కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కనీస పెన్షన్ కోసం గత కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని ఈ నేపథ్యంలో ఈనెల 11న విజయనగరం PF కార్యాలయం వద్ద ధర్నా చేపట్టలని నిర్ణయించామన్నారు.

February 9, 2025 / 01:21 PM IST

వైద్యురాలి బ్రెయిన్ డెడ్.. అవయవదానం

RR: నార్సింగి పరిధిలోని మేకన్ గడ్డ వద్ద జరిగిన ప్రమాదంలో వైద్యుడు యశ్వంత్ మృతి చెందగా.. వైద్యురాలు భూమిక తీవ్ర గాయాల పాలైన విషయం తెలిసిందే. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా భూమికకు బ్రెయిన్ డెడ్ అయింది. నలుగురి జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో గుండె, లివర్, కళ్లు, కిడ్నీలను దానం చేశారు. కూతురు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

February 9, 2025 / 01:09 PM IST

అత్యాచార ఘటనపై కేసు నమోదు

NTR: కంచికచర్ల పట్టణ పరిధిలోని పోలీస్ స్టేషన్లో ఏసీపీ తిలక్ ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న యువతిపై అత్యాచార ఘటనపై కేసు నమోదు చేశామని చెప్పారు. హుస్సేన్ అనే వ్యక్తి ఆమెను ప్రేమ పేరుతో తన స్నేహితుడైన సిద్దు ఇంటికి తీసుకువెళ్లగా.. సిద్దు అత్యాచారం చేసినట్లు తెలిపాడు. అదే విధంగా ఈ కేసులో ఒకరిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.

February 9, 2025 / 01:08 PM IST

ఓఆర్ఆర్‌పై ఆకతాయిల హల్చల్

HYD: నగర శివార్లలోని ORR పై రాత్రివేళ ఆకతాయిలు హల్చల్ చేస్తూ ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రమాదకరంగా కారు రేసింగులు, స్టంట్లు చేస్తూ హంగామా చేస్తున్నారు. శంషాబాద్ సమీపంలో ఔటర్‌పై ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డవడంతో.. స్టంట్లు చేసిన యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

February 9, 2025 / 01:04 PM IST

విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే

RR: చేవెళ్ల మండలం పామెన గ్రామంలో దుర్గమ్మ, మైసమ్మ, సరోజనమ్మ దేవతల విగ్రహ ప్రతిష్టాపనల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

February 9, 2025 / 12:55 PM IST

‘నిర్బంధించి పని చేయించటం చట్టరీత్యా నేరం’

SKLM: కార్మికులను నిర్బంధించి పని చేయించటం చట్ట రీత్యా నేరమని శ్రీకాకుళం అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వై. శైలేశ్ కుమార్ అన్నారు. వెట్టి చాకిరి నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఆదివారం స్థానిక ఎన్జీఓ హోమ్ వద్ద ర్యాలీ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులను నిర్ణీత పని గంటల తర్వాత స్వేచ్ఛగా తాము జీవించే హక్కుందని సూచించారు.

February 9, 2025 / 12:52 PM IST

చీపురుపల్లి అమ్మవారి జాతరకు ముహూర్తపురాట

VZM: చీపురుపల్లి మేజర్ పంచాయతీలో వెలసిన ఉత్తరాంధ్ర కల్పవల్లిగా పూజించే శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి జాతరకు తొలి ఘట్టం మొదలైంది. ఆలయ ప్రాంగణంలో ఈవో బి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆదివారం ముహూర్తపురాట వేశారు. ఈవో మాట్లాడుతూ.. మార్చి నెల 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు అమ్మవారి జాతరను నిర్వహిస్తున్నామన్నారు. జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

February 9, 2025 / 12:27 PM IST