ASF: కాగజ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ట్రేడ్ లైసెన్స్ లేని, గడువు ముగిసిన దుకాణాలపై బుధవారం అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. శానిటరీ ఇన్పెక్టర్, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ సిబ్బందితో కలిసి పలు దుకాణాలను పరిశీలించారు. లైసెన్స్ లేకుండా లేదా రీన్యువల్ చేయని యజమానులను గుర్తించి, చట్ట ప్రకారం నోటీసులు జారీ చేసి జరిమానాలు విధించారు.
NRML: ముధోల్ మండలం అష్ట గ్రామంలోని పదవ తరగతి పబ్లిక్ పరీక్షా కేంద్రంలో బుధవారం గ్రామ సర్పంచ్ రావుల లావణ్య శ్రీనివాస్ విద్యార్థులకు అల్పాహారం పంపిణీ చేశారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులకు పాలు, బిస్కెట్లు అందజేసి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు భయాందోళనలు లేకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
WNP: పోలీసు కేవలం విధుల్లోనే కాకుండా క్రీడల్లో కూడా ప్రతిభ కనపరచడం అభినందనీయం అని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో క్రీడాకారులకు క్రికెట్ జట్టుకు జెర్సీలను అందజేశారు. ఆమె మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయన్నారు. పోలీసు క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలన్నారు.
BDK: అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను అదనపు కలెక్టర్ విద్యాచందన ఆదేశించారు. చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామంలో ఆమె నేడు పర్యటించారు. స్వయం సహాయక సంఘాల బిల్డింగ్, సీసీ రోడ్లు నిర్మాణ పనులను పరిశీలించారు. మిగతా అభివృద్ధి పనులపై ఆరా తీశారు. ఎంపీడీవో అశోక్, సర్పంచ్, ఉప సర్పంచ్ బొర్రా లలిత, బాలు పాల్గొన్నారు.
సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా IPLలో కొన్ని మ్యాచ్లకు దూరం కానున్నాడు. ఈ క్రమంలో కమిన్స్ కోలుకునే వరకు SRHకు కెప్టెన్గా ఇషాన్ కిషన్ను, వైస్ కెప్టెన్గా అభిషేక్ శర్మను యాజమాన్యం ప్రకటించింది. కాగా గత IPL సీజన్లో ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో SRH అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయింది.
SRCL: వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి వారిని హైదరాబాద్ క్రికెట్ అసోసియాన్ సెక్రటరీ తమిడి శెట్టి బసవరాజు దర్శించుకుని పూజలు చేశారు. భీమేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారికి ప్రత్యేకంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆంజనేయ స్వామికి పూజలు నిర్వహించారు. అర్చకులు ఆశీర్వచనం అందజేశారు.
TPT: తిరుపతి వినాయక సాగర్లో నిమజ్జనానికి అనుకూలంగా మరో నీటి కుంట తవ్వాలని, భారీ నాట్య గణపతి విగ్రహం ఏర్పాటు చేయాలని వరసిద్ది వినాయక మహోత్సవ కమిటీ డిమాండ్ చేసింది. కార్పొరేషన్ కమిషనర్ మౌర్యను బుధవారం కలిశారు. వెంటనే అంచనాలు సిద్ధం చేసి పనులు ప్రారంభించాలని ఇంజినీర్ శ్యాంసుందర్కు కమిషనర్ సూచనలు చేశారు.
నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఇంటర్, పదవ పరీక్షలు రాసిన విద్యార్థులు తిరుగు ప్రయాణంలో కళాశాల, పాఠశాల వాహనాల్లో పేపర్లను చించి రోడ్లపై విసిరేయడం మానుకోవాలని కమిషనర్ వై. ఓ నందన్ సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు వారికి అవగాహన కల్పించి, రహదారులను పాడు చేయకుండా చూడాలన్నారు. ఈ నిర్లక్ష్య ధోరణిని అరికట్టాలని ఆయన ఆదేశించారు.
AP: జగన్ లాంటి అన్న ఉంటే శత్రువులు అనవసరమని పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. ‘అన్న అనే పదానికి కళంకం.. జగన్. మీరు వెలివేస్తేనే సునీత ఒంటరి పోరాటం చేస్తోంది. మీరు న్యాయం చేయనందునే సునీతకు కర్మ పట్టింది. సునీతకు సీబీఐ, బీజేపీ అన్యాయం చేస్తున్నాయి’ అని పేర్కొంది.
అన్నమయ్య: జిల్లా పోలీసులు రికార్డు స్థాయిలో రూ.1.54 కోట్ల విలువైన 716 సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. మదనపల్లిలో జరిగిన కార్యక్రమంలో డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఫోన్లను పంపిణీ చేశారు. ఫోన్ పోయిన వారు పోలీస్ స్టేషన్కు రావాల్సిన అవసరం లేకుండా వాట్సాప్ నెంబర్ 8688830012 ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ తెలిపారు.
VSP: సదరన్ విద్యా సంస్థల యాన్యువల్ స్పోర్ట్స్ మీట్-2026లో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి వాలీబాల్ ఆడి ఉత్సాహపరిచారు. అనంతరం వాలీబాల్, బ్యాడ్మింటన్, క్రికెట్ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. క్రీడలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిపారు.
ELR: నూజివీడు మండలం హనుమంతుని గూడెం గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఏలూరు జిల్లా వ్యవసాయ అధికారి షేక్ హబీబ్ భాష మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాలలో ఈ నెల 16 నుండి 25 వరకు రైతన్న మీకోసం కార్యక్రమం కొనసాగుతుందన్నారు. మండలంలో 9088 కుటుంబాలలో 5514 కుటుంబాలకు సర్వే పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏవో చెన్నారావు పాల్గొన్నారు.
KRNL: ఆదోని మండలం పాండవగల్లుకు చెందిన 60 ఏళ్ల ఉపాధి కూలీ చిన్న మారేన్న బుధవారం వడదెబ్బతో మృతి చెందారు. ఉదయం పని చేస్తుండగా కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. వైద్యం అందిస్తున్న సమయంలోనే మరణించినట్లు వైద్యులు తెలిపారు. 7 ఏళ్ల క్రితం భార్య మరణించగా, కూలీ పని చేస్తూనే ఇద్దరు కుమారులకు పెళ్లిళ్లు చేశారు. కుమారుల రోదనలు వర్ణనాతీతంగా ఉన్నాయి.
RR: కేశంపేట మండలం వేములనర్వ గ్రామ శివారులోని వేణు గోపాల స్వామి గుట్టపై గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లుగా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గత 2 రోజులుగా గుట్టపై జరుగుతున్న తవ్వకాలపై విస్తృత చర్చ జరుగుతున్న అధికారులు స్పందించడం లేదని వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి గుట్టపై అక్రమ తవ్వకాలు జరిపిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో బుధవారం పత్తి దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 8 వాహనాల్లో 75 క్వింటాళ్ల విడిపత్తిని రైతులు తీసుకువచ్చారు. గరిష్ఠంగా క్వింటాకు రూ. 7,500, కనిష్ఠంగా రూ. 7,200 ధరకు ప్రైవేట్ వ్యాపారులు బహిరంగ వేలం ద్వారా పత్తిని కొనుగోలు చేశారు. నిన్నటి కంటే తాజాగా పత్తి గరిష్ఠ ధర రూ. 50 పెరిగింది. రైతులు నాణ్యత పాటించాలన్నారు.