NRML: ముధోల్ మండలం అష్ట గ్రామంలోని పదవ తరగతి పబ్లిక్ పరీక్షా కేంద్రంలో బుధవారం గ్రామ సర్పంచ్ రావుల లావణ్య శ్రీనివాస్ విద్యార్థులకు అల్పాహారం పంపిణీ చేశారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులకు పాలు, బిస్కెట్లు అందజేసి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు భయాందోళనలు లేకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.