ATP: తాడిపత్రి పట్టణంలోని జీవీపీ కాలనీలో ఉగాది పండుగను పురస్కరించుకుని శ్రీ చౌడేశ్వరీదేవి అమ్మవారి జ్యోతుల ప్రదర్శన కార్యక్రమం వైభవంగా జరిగింది. భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేకే పూజలు, పల్లకీ సేవ చేసి జ్యోతులను ఊరేగిస్తూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకలో కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.