MHBD: మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం శివారు సీతారాం తండా స్టేజీ వద్ద ఇవాళ ఆటోను ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఆరుగురు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ రామసాని వెంకన్న (55) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆటోలో కురివి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.