MDK: రామాయంపేట మండలానికి చెందిన పలువురు రైతులు శుక్రవారం సిద్దిపేట జిల్లా నర్మెటలో నిర్వహిస్తున్న రైతు మేళా కార్యక్రమానికి బయలుదేరారు. రామాయంపేట వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండల పరిధిలోని పలు రైతులను ప్రత్యేక వాహనంలో నర్మెట రైతు మేళకు అధికారులు తరలించారు. వ్యవసాయ పరికరాల ప్రదర్శన, శాస్త్రవేత్తలతో అవగాహన కార్యక్రమంలో వీరు పాల్గొంటారని తెలిపారు.