WNP: ఎమ్మెల్యే మేఘారెడ్డి రెండు కుటుంబాలకు సంబంధించిన బాధితులకు మెరుగైన వైద్య చికిత్స కోసం LOCలను అందజేశారు. వనపర్తి పట్టణం నందిమల్ల గడ్డకు చెందిన వెంకటమ్మకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు ప్రభుత్వపరమైన రూ. 4 లక్షల LOC ని మంజూరు చేయించారు. ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలకు మెరుగైన వైద్యం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందన్నారు.