SRCL: పీఎం శ్రీ కింద జిల్లాలోని పలు విద్యాలయాల్లో అమలు అవుతున్న కార్యక్రమాలను పీఎంశ్రీ నోడల్ అధికారి, కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్, అర్బన్ ఎఫైర్స్ జాయింట్ సెక్రటరీ ప్రవీర్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. తంగళ్ళపల్లి మండలం మండేపల్లిలోని మోడల్ స్కూల్, కేంద్రీయ విద్యాలయాలను సందర్శించారు. జిల్లాలో చేపట్టిన పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు.
ADB: రాష్ట్రీయ పర్ధాన్ జనజాతి ఉద్దాన్ సంఘటన్ సంస్థ సభ్యులు జిల్లా కలెక్టర్ రాజర్షి షాను కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 15న నిర్వహించనున్న గోండి ధర్మ గురు హిరాసుకా లింగో జయంతి ఉత్సవాల కరపత్రాలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆవిష్కరించారు. రాష్ట్ర అధ్యక్షుడు యాదవ్ రావు, శంకర్, మాధవ్, తదితరులు ఉన్నారు.
NZB: ముప్కాల్ మండలం వేంపల్లిలో శుక్రవారం కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేశారు. రూ.1.16 లక్షల విలువైన రెండు చెక్కులను ఇద్దరు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. లబ్ధిదారులు సీఎం రేవంత్, బాల్కొండ కాంగ్రెస్ ఇంఛార్జ్ సునీల్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేంపల్లి సర్పంచ్ మహేశ్ యాదవ్, రెవెన్యూ అధికారులు, గ్రామ శాఖ అధ్యక్షుడు మల్లయ్య పాల్గొన్నారు.
NZB: భీమ్గల్ మండలం రహత్ నగర్లో సేవాలాల్ జయంతి వేడుకల్లో రాష్ట్ర సహకారయూనియన్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి పాల్గొని ఆయన సేవలను కొనియాడారు. గిరిజన అభివృద్ధికి పార్టీలకు అతీతంగా కృషి చేయాలన్నారు. గిరిజన ప్రాంతంలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
KNR: వేసవి ముంచుకొస్తున్న నేపథ్యంలో చిగురుమామిడి మండలం సుందరగిరిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా సర్పంచ్ జంగా శిరీష ముందస్తు చర్యలకు ఉపక్రమించారు. గ్రామంలోని హైస్కూల్ వద్ద ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉన్న బావిని పునరుద్ధరించే పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టారు. క్షేత్రస్థాయిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని పనులు చేయిస్తున్నారు.
JGL: అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) బీ. రాజ గౌడ్ శుక్రవారం కోరుట్లలోని కస్తూర్భ గాంధీ బాలికల విద్యాలయం(KGBV) పాఠశాలను ఆకస్మికంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు రిజిస్టర్, విద్యా ప్రగతి, బోధన విధానాలపై సమీక్ష నిర్వహించారు. హాస్టల్ సదుపాయాలు, తాగునీటి వసతులు పరిశీలించి వంటగదిని సందర్శించారు. మధ్యాహ్న భోజనం నాణ్యత, నిల్వ విధానాలపై ఆరా తీశారు.
PPM: పార్వతీపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రేపు మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో కొండపల్లి సత్యం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొనాలని కోరారు . మండలానికి సంబంధించి అధికారులందరూ ప్రగతి నివేదికతో కార్యక్రమంలో పాల్గొనాలని అధికారులను ఆదేశించారు.
VZM: కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని ఏపీ మార్క్ ఫెడ్ ఛైర్మన్ కర్రోతు బంగారు రాజు కోరారు. జామి మండలం విజినగిరిలో శుక్రవారం అపరాలు కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల ద్వారా మినుములు క్వింటాకు రూ.7,800, పెసలు 8,768 చెల్లించడం జరుగుతుందన్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే PUC ఛైర్మన్ రవికుమార్ అధ్యక్షతన అమరావతిలో శుక్రవారం ప్రభుత్వ రంగ సంస్థల పనితీరుపై అధికారులతో సమావేశం నిర్వహించారు. శ్రీకాకుళం లోని డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ పనితీరుపై సమీక్షించారు. విద్యా అభివృద్ధి, గిరిజన సంక్షేమ పథకాలు, నిధుల వినియోగం వంటి అంశాలపై అధికారులకు వివరాల అడిగి తెలుసుకున్నారు.
AKP: ఎలమంచిలి ఇంటర్ పరీక్ష కేంద్రం వద్ద ఓవర్ స్పీడ్తో హల్చల్ చేస్తున్న ఇద్దరు బైక్ రైడర్స్ను శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. వారిని సీఐ ధనుంజయ నాయుడు వద్దకు తీసుకురాగా వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అలాగే ఒక్కొక్కరికి రూ.5,035 చొప్పున ఫైన్ విధించారు. రోడ్ భద్రత నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.
ASR: అరకు నియోజకవర్గానికి చెందిన ఆరు మండలాల నాయకులతో అత్యవసర సమావేశం శనివారం నిర్వహించనున్నట్లు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తెలిపారు. ఈ సమావేశానికి ఉత్తరాంధ్ర రీజినల్ కో-ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, అరకు పార్లమెంట్ పరిశీలకులు బొడ్డేడ ప్రసాద్, అరకు–పాడేరు నియోజకవర్గాల పార్టీ పరిశీలకులు ఏరువాక సత్యరావు హాజరవుతారన్నారు.
కృష్ణా: రేపటి తరానికి విలువలతో భవిష్యత్ అందించటమే జనసేన పార్టీ లక్ష్యమని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. శుక్రవారం నాగాయలంకలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు శిబిరాన్ని వెంకట్రామ్ సందర్శించి, సాధకులను అభినందించారు. సమాజం బాగుపడాలని కోరుకునే యువత ప్రతి ఒక్కరు జనసేన ఉద్యమి సభ్యత్వం తీసుకోవాలని కోరారు. ఇందులో జనసేన నాయకులు పాల్గొన్నారు.
GNTR: తెనాలి నియోజకవర్గంలో కీలకమైన నందివెలుగు – ఆటో నగర్ (తెనాలి–మంగళగిరి) రహదారి అభివృద్ధి పనులకు రూ. 2.00 కోట్ల వ్యయంతో శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేసి పనులకు శ్రీకారం చుట్టారు. రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
TG: ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంపై BJP ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. ఈ కేసులో కేవలం సాక్ష్యాలు లేవని మాత్రమే కోర్టు చెప్పింది తప్ప.. కవిత నిర్దోషని క్లీన్ చిట్ ఇవ్వలేదన్నారు. BJP, BRS ఒకటి కాదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో చాలా మంది రక రకాలుగా మాట్లాడుతుంటారని, వాటన్నింటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.
PLD: గృహ నిర్మాణ రంగానికి రాష్ట్ర బడ్జెట్లో రూ.6,357 కోట్లు కేటాయించడం శుభపరిణామమని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం ఇస్తామన్న సీఎం నిర్ణయం చరిత్రాత్మకమన్నారు. గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాల పేరుతో జరిగిన అవినీతిపై ప్రత్యేక కమిటీ వేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.