NZB: భీమ్గల్ మండలం రహత్ నగర్లో సేవాలాల్ జయంతి వేడుకల్లో రాష్ట్ర సహకారయూనియన్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి పాల్గొని ఆయన సేవలను కొనియాడారు. గిరిజన అభివృద్ధికి పార్టీలకు అతీతంగా కృషి చేయాలన్నారు. గిరిజన ప్రాంతంలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.