KNR: వేసవి ముంచుకొస్తున్న నేపథ్యంలో చిగురుమామిడి మండలం సుందరగిరిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా సర్పంచ్ జంగా శిరీష ముందస్తు చర్యలకు ఉపక్రమించారు. గ్రామంలోని హైస్కూల్ వద్ద ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉన్న బావిని పునరుద్ధరించే పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టారు. క్షేత్రస్థాయిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని పనులు చేయిస్తున్నారు.