NZB: ముప్కాల్ మండలం వేంపల్లిలో శుక్రవారం కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేశారు. రూ.1.16 లక్షల విలువైన రెండు చెక్కులను ఇద్దరు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. లబ్ధిదారులు సీఎం రేవంత్, బాల్కొండ కాంగ్రెస్ ఇంఛార్జ్ సునీల్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేంపల్లి సర్పంచ్ మహేశ్ యాదవ్, రెవెన్యూ అధికారులు, గ్రామ శాఖ అధ్యక్షుడు మల్లయ్య పాల్గొన్నారు.