ASR: అరకు నియోజకవర్గానికి చెందిన ఆరు మండలాల నాయకులతో అత్యవసర సమావేశం శనివారం నిర్వహించనున్నట్లు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తెలిపారు. ఈ సమావేశానికి ఉత్తరాంధ్ర రీజినల్ కో-ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, అరకు పార్లమెంట్ పరిశీలకులు బొడ్డేడ ప్రసాద్, అరకు–పాడేరు నియోజకవర్గాల పార్టీ పరిశీలకులు ఏరువాక సత్యరావు హాజరవుతారన్నారు.