కృష్ణా: రేపటి తరానికి విలువలతో భవిష్యత్ అందించటమే జనసేన పార్టీ లక్ష్యమని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. శుక్రవారం నాగాయలంకలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు శిబిరాన్ని వెంకట్రామ్ సందర్శించి, సాధకులను అభినందించారు. సమాజం బాగుపడాలని కోరుకునే యువత ప్రతి ఒక్కరు జనసేన ఉద్యమి సభ్యత్వం తీసుకోవాలని కోరారు. ఇందులో జనసేన నాయకులు పాల్గొన్నారు.