కర్నూలు కాంగ్రెస్ జిల్లా కమిటీ నూతన కార్యవర్గం ఏర్పాటుకు ఆశావహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు క్రాంతి నాయుడు తెలిపారు. మార్చి 10లోగా కార్యవర్గాన్ని ప్రకటిస్తామన్నారు. యువకులు, మహిళలు, ట్రాన్స్ జెండర్లు, సామాజిక సేవకులు బయోడేటాలతో జిల్లా కార్యాలయంలో దరఖాస్తు చేయాలని ఆయన సూచించారు.
MNCL: క్యాతనపల్లిలో ఈనెల 17న చోటు చేసుకున్న ఉద్రిక్త ఘటనలపై నమోదైన 2 కేసుల్లో ఒక కేసుకు సంబంధించి మాజీ MLA బాల్క సుమన్, మరికొందరు BRS నాయకులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మంత్రి కాన్వాయ్ పై దాడి, రాళ్ల దాడిలో పలువురు గాయపడ్డారనే ఆరోపణలతో పోలీసులు 2 వేర్వేరు కేసులు నమోదు చేశారు. మరో కేసుకు సంబంధించి గురువారం మంచిర్యాల కోర్టులో విచారణ ఉంది.
W.G: నరసాపురం డీఎస్పీ శ్రీవేదను బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 2018 బ్యాచ్కు చెందిన 25 మంది డీఎస్పీలను పోలీస్ కార్యాలయంకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ భారీ బదిలీల జాబితాలో నరసాపురం డీఎస్పీ శ్రీవేద పేరు కూడా ఉంది. డీఎస్పీగా శ్రీవేద అనేక సవాళ్లతో కూడిన కేసులను ఛేదించారు.
క్రికెట్ ప్రేమికులకు మెట్రో రైలు సంస్థ తీపి కబురు చెప్పింది. టీ20 ప్రపంచకప్ -2026లో భాగంగా ఇవాళ భారత్, జింబాబ్వే తలపడనున్నాయి. ఈ క్రమంలో మ్యాచ్ టికెట్లు ఉన్నవారు ఒకసారి ఫ్రీగా ప్రయాణించడానికి అవకాశం కల్పించింది. కాగా ఈ మ్యాచ్ చెన్నై చేపాక్లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనున్న విషయం తెలిసిందే.
NRPT: డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ లావణ్య తెలిపారు. కోస్గి, నారాయణపేట డిపోల పరిధిలోని ప్రయాణికులు 7382826293 నంబర్కు ఫోన్ చేసి ఆర్టీసీ సేవలు, సమస్యలు, సలహాలు, సూచనలు ఫోన్ ద్వారా తెలియజేయాలని చెప్పారు. గురువారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు కార్యక్రమం ఉంటుందని చెప్పారు.
PPM: పట్టణంలో మార్చి 1న జరగబోయే కౌలు రైతుల మహా సభలు విజయవంతం చెయ్యాలని రైతు సంఘం జిల్లా నాయకుడు రెడ్డి సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం మక్కువ మండలం తురుమామిడి గ్రామంలో ప్రచారం నిర్వహించారు. కౌలు రైతులు కౌలు కార్డులు మంజూరు చెయ్యాలని, అన్నదాత సుఖీభవ పథకం వర్తింపు, బ్యాంకు రుణాలు, తదితర సమస్యల పరిష్కారం కోసం ఈ సభలు నిర్వహిస్తున్నామన్నారు.
KKD: ఇంటి, కుళాయి, ఖాళీ స్థలాల పన్నులను సకాలంలో వసూలు చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ సంపత్ కుమార్ ఆదేశించారు. బుధవారం పిఠాపురంలో అధికారులతో నిర్వహించిన రివ్యూ సమావేశంలో ఆయన మాట్లాడారు. నిధులను నిబంధనల మేరకే ఖర్చు చేయాలన్నారు. కమిషనర్ సెలవులో ఉన్నప్పుడు ఇన్ఛార్జ్ కమిషనర్ నిబంధనలకు విరుద్ధంగా నిధులు ఖర్చు చేశారన్నారు
తిరుపతిలో ఆశాలత తన కుమార్తెను హత్య చేసిన విషయం తెలిసిందే. భర్తతో విడాకులు తీసుకున్న ఆమెకు SM ద్వారా రెడ్డి కుమార్ పరిచయం కాగా అది కాస్త సహజీవనానికి దారి తీసింది. ఈ క్రమంలో వారు పెళ్లి చేసుకోగా కుటుంబీకులు అడ్డుపడ్డారు. దీంతో తమకు బిడ్డ అడ్డుగా ఉందన్న ఒత్తిడితో వారు చిన్నారిని హతమార్చి ఇసుక దిబ్బల్లో పూడ్చినట్లు పోలీసులు తెలిపారు.
AP: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం బ్రహ్మంగారి మఠం వారసత్వ వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. గత నాలుగున్నరేళ్లుగా ఖాళీగా ఉన్న పీఠానికి నేడు 12వ తరం పీఠాధిపతిగా వెంకటాద్రిస్వామి పట్టాభిషేకం జరగనుంది. దేవదాయశాఖ నిబంధనల ప్రకారం ఆయన తాత్కాలిక పీఠాధిపతిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించనున్నారు.
KMM: ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి నగరంలోని బైపాస్ రోడ్డు, కొత్త బస్టాండ్ వంటి ప్రాంతాలలో రోడ్డు భద్రతా పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో గుర్తించిన 30 బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదాల నివారణకు జీబ్రా క్రాసింగ్లు, సోలార్ బ్లింకర్స్, సైన్ బోర్డులను వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
HNK: కుమ్మెర GPలోని జరిగిన కుల వివక్షత దాడిపై రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని PDSU నాయకులు నిన్న సాయంత్రం కలెక్టర్ కార్యాలయం ముందు నల్ల జెండాలతో నిరసన తెలియజేశారు. అనంతరం PDSU (C) మహేష్ మాట్లాడుతూ.. అభం శుభం తెలియని పశు గుడ్డును తొక్కి చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
NTR: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం హెచ్బీ కాలనీలో నూరే ఇలాహీ మసీదులో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఎంపీ కేశినేని చిన్ని బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలపై అల్లాహ్ ఆశీస్సులు ఉండాలని, అన్నారు. రంజాన్ మాసంలో చేసే ఉపవాస దీక్షలు క్రమశిక్షణ, ఆత్మ పరిశీలన, సహనం వంటి విలువలను పెంపొందిస్తాయని తెలిపారు.
VKB: జిల్లా కలెక్టరేట్లో జరిగిన బ్యాంకర్ల జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ సుధీర్ మాట్లాడుతూ.. బ్యాంకులు ప్రభుత్వ పథకాల అమలుకు ప్రాధాన్యతనిస్తూ నిర్దేశిత రుణ లక్ష్యాలను అధిగమించాలని సూచించారు. అర్హులైన నిరుపేదలు, స్వయం సహాయక సంఘాలు, చిన్న వ్యాపారులకు సులభంగా రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
AKP: ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే నెలలో నక్కపల్లిలో పర్యటించనున్నారు. ఈ మేరకు ప్రధాని పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ విజయ కృష్ణన్ నక్కపల్లిలో అధికారులతో సమీక్షించారు. కాగిత గ్రామం వద్ద హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. భద్రత ఏర్పాట్లు, రహదారి సౌకర్యం, తాత్కాలిక వసతులు కల్పనపై ఆమె అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. భద్రత చర్యలను కట్టుదిట్టం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.