హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ సాయంత్రం బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఉదయంతో పోల్చితే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.980 తగ్గి రూ.1,61,130కు చేరగా, ఆభరణాలకు వాడే 22 క్యారెట్ల ధర రూ.900 తగ్గి రూ.1,47,700గా నమోదైంది. మరోవైపు వెండి ధరలో ఎలాంటి మార్పు లేకుండా రూ.2,90,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
భారత్తో సెమీస్లో ఇంగ్లండ్ యువ ఆటగాడు జేకబ్ బెథల్ (22 ఏళ్లు) తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఒంటరి పోరాటం చేస్తూ దాదాపు ఇంగ్లండ్ను గెలిపించినంత పని చేశాడు. ఇంగ్లండ్ ఓడిపోయినప్పటికీ, బెథల్ పోరాటం అభిమానుల మనసులను గెలుచుకుంది. అయితే, 2022లో IND-ENG సెమీస్ను బెథల్ స్టేడియంలో కూర్చుని ప్రేక్షకుడిలా చూశాడు. కేవలం నాలుగేళ్లలోనే స్టార్గా ఎదగడం విశేషం.
AKP: కోటవురట్ల పంచాయతీ పరిధిలో లోవోల్టేజ్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ పరమేశ్వరరావు తెలిపారు. శుక్రవారం స్థానిక బీసీ కాలనీలో లో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి కొత్త డీటీఆర్ ఎరెక్షన్ అమర్చారు. విద్యుత్తు సమస్యలపై ఫిర్యాదులు అందిన వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు లైన్మెన్ నూకరాజు తెలిపారు.
TG: తెలంగాణలో ఇటీవల గ్రూప్-1 ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులే.. ఇవాళ విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో చాలా మంది సత్తా చాటారు. గుడెల్లి సృజన గ్రూప్1 లో డీఎస్పీ పదవి సాధించి.. ఇప్పుడు యూపీఎస్సీలో 55వ ర్యాంకుతో మెరిసింది. కొలిపాక శ్రీ కృష్ణ 150వ ర్యాంకు, ఎం. వెంకటేష్ 358వ ర్యాంకు, బి. విక్రమ్ 472వ ర్యాంకు, విక్రమ్ సింహా రెడ్డి 541వ ర్యాంకు, నవీన్ 715వ ర్యాంకు సాధించారు.
TPT: సత్యవేడు మండలం కొత్తమారికుప్పం పంచాయతీ ఇంద్రపురం కాలనీలో నూతన సిమెంటు రోడ్డు నిర్మాణానికి జడ్పీటీసీ విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నఈటిపాకం, రాచపాలెం, ఇంద్రపురం ప్రాంతాల్లో సీసీ రోడ్లు, కాలమనాయుడుపేటలో కల్వర్టు నిర్మాణం సహా మొత్తం రూ.18 లక్షల జడ్పీ నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
VZM: మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు జిల్లా కేంద్రంలోని పోలీస్ బ్యారెక్స్లో ఏర్పాట్లను పక్కాగా చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అమరావతి నుంచి సీఎం పాల్గొన్న కార్యక్రమం జిల్లా స్థాయిలో లైవ్ టెలికాస్ట్ కావాలని సూచించారు. అలాగే, అధికారులకు పలు సూచనలు చేశారు.
W.G: భీమవరంలో పర్యటించిన మాజీ మంత్రి రోజా కూటమి ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆలయాలను, లడ్డూ ప్రసాదాన్ని వివాదాల్లోకి లాగడం సరికాదని పేర్కొన్నారు. శాసనమండలి ఛైర్మన్ కులం, జాతి గురించి ప్రస్తావించడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని ఆరోపించారు. దేవాలయాల ప్రతిష్టను దెబ్బతీసేలా దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు.
AP: టెంపుల్ సిటీ తిరుపతిపై యుద్ధం ఎఫెక్ట్ పడనుంది. రేపటి నుంచి కమర్షియల్ సిలెండర్ సరఫరా నిలిపివేయాలని గ్యాస్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 19.5 కిలోల సిలెండర్ల సరఫరా నిలిపివేయనున్నాయి. పలు గ్యాస్ కంపెనీల నిర్ణయంతో 3 వేలకు పైగా హోటల్స్కు ఎఫెక్ట్ పడనుంది. ఈ క్రమంలో గ్యాస్ బుకింగ్స్ పెరిగాయి. గృహ వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా నిర్ణయం తీసుకున్నాయి.
మార్కాపురంలో సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మా నాయక్ అధ్యక్షతన ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం జిల్లాలోని హాస్టల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థుల ఉత్తీర్ణతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, హాస్టళ్లలో విద్యార్థుల సంక్షేమం, ఆరోగ్యం, పరిశుభ్రతపై నిర్లక్ష్యం ఉండకూడదని అధికారులను ఆదేశించారు.
బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమా మహేశ్వర్ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా శుక్రవారం చందోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని రెడ్డిపాలెం టోల్ ప్లాజా వద్ద ఎస్సై మర్రి వెంకట శివకుమార్ వాహనాల తనిఖీ నిర్వహించారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం నేరమని, వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు.
SKLM: మందస మండలం హరిపురంలో మార్పు ట్రస్టు గ్రంథాలయంలో రైతాంగ సమస్యల సాధన కమిటీ అధ్యక్షులు మామిడి మాధవరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీడి పిక్కల గిట్టుబాటు కల్పించాలని వ్యవసాయ ఉద్యానవన అధికారులను కోరారు. అలాగే, పిచికారి యంత్రాలను ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు.
SDPT: మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు సిద్దిపేట పట్టణంలోని 13వ వార్డులో పేద ముస్లింలకు బీఆర్ఎస్ నాయకులు రంజాన్ కిట్లను పంపిణీ చేశారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కొండం సంపత్ రెడ్డి పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఇబ్బంది పడకూడదని కిట్లను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కౌన్సిలర్ డాక్టర్ విఠోబ, నాయకులు పత్రి శ్రీనివాస్ యాదవ్, బషీర్, అన్వర్లు పాల్గొన్నారు.
SRPT: తిరుమలగిరి మండలంలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. జువాలజీ, హిస్టరీ, మ్యాథమెటిక్స్, తదితర పరీక్షలకు మొత్తం 175 మంది విద్యార్థులకు గాను 160 మంది హాజరుకాగా, 15 మంది హాజరు కాలేదు. పరీక్షా కేంద్రాల వద్ద బీఎన్ఎస్ 163 సెక్షన్ అమల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
SRCL: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” 99 రోజుల ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశాల మేరకు ప్రత్యేక వైద్య నిపుణుల సేవలు వినియోగించు కోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. రజిత తెలిపారు. అన్ని వయసుల వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించామని వెల్లడించారు.
TG: మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి ఛైర్మన్ ఎన్నిక 3 వారాల్లో నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికలు జరిగి నెలరోజులు అవుతున్నా.. ఛైర్మన్ ఎన్నిక నిర్వహించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, క్యాతన్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్, సీపీఐ కూటమి 14 సీట్లు గెలుపొందిన విషయం తెలిసిందే.