AKP: కోటవురట్ల పంచాయతీ పరిధిలో లోవోల్టేజ్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ పరమేశ్వరరావు తెలిపారు. శుక్రవారం స్థానిక బీసీ కాలనీలో లో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి కొత్త డీటీఆర్ ఎరెక్షన్ అమర్చారు. విద్యుత్తు సమస్యలపై ఫిర్యాదులు అందిన వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు లైన్మెన్ నూకరాజు తెలిపారు.