అన్నమయ్య: మదనపల్లెలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం నాటికి నాలుగో రోజుకు చేరుకున్నాయి. స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని వారు ఆరోపించారు.
KRNL: ఖండేరి వీధికి చెందిన మనోహర్ (40) హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 22న పాత బస్టాండ్ సమీపంలోని బార్ వద్ద జరిగిన గొడవలో తెలుగు నగేశ్, తెలుగు రాజు, ఎరుకలి రాముడు, తెలుగు ఈరన్న కత్తులు, కర్రలతో దాడి చేసి హత్య చేసినట్లు డీఎస్పీ జె. బాబు ప్రసాద్ తెలిపారు. నిందితుల నుంచి ఆటో, రెండు కత్తులు స్వాధీనం చేసి రిమాండ్కు పంపారు.
అన్నమయ్య: కర్ణాటకలోని హోస్కోట వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లగుట్లపల్లికి చెందిన శ్రీహరి (27) దుర్మరణం చెందారు. బెంగళూరులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న శ్రీహరి, స్వగ్రామంలో పనులు ముగించుకుని బైక్పై బెంగళూరుకు తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. కొడుకు మృతితో నల్లగుట్లపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.
MDK: విద్యుత్ షాక్ తగిలి దున్నపోతు మృతి చెందిన ఘటన శంకరంపేట మండలం తిరుమలాపూర్లో గురువారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలి బుజమ్మకు చెందిన గేదె పొలంలో మేత మేస్తూ విద్యుత్ స్తంభానికి ఉన్న సపోర్ట్ తీగ తగిలి విద్యుత్ షాక్తో అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో సుమారు రూ.40 వేల ఆస్తి నష్టం జరిగిందని బుజమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరాకు అడ్వకేట్ పవన్ కుమార్ వినతి పత్రం అందజేశారు. ఫిబ్రవరి 21న 4వ పట్టణ సీఐ విక్రమ సింహాతో జరిగిన వివాదాన్ని పరస్పర చర్చలతో సఖ్యంగా పరిష్కరించుకున్నామని, ఎవరి ప్రమేయం లేదని, ఎవరిపై చర్యలు తీసుకోవద్దని లిఖితపూర్వకంగా కోరారు. ఈ అంశం ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది.
NDL: ఎండాకాలం వచ్చిందంటే పుచ్చకాయల అమ్మకాలు జోరుగా సాగుతాయి. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అయితే వెలుగోడులో వేసవికి కొన్ని రోజుల ముందే పుచ్చకాయలు వచ్చినప్పటికీ వాటికి డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ఒక్కొక్క పుచ్చకాయ ధర రూ.160 నుంచి రూ.240 వరకు ఉండటంతో ప్రజలు కొనుగోలు చేయడానికి బెంబేలెత్తి పోతున్నారు.
TG: షీ టీమ్స్, CC కెమెరాలతో ఎక్కడికక్కడ నిఘా పెట్టినా పోకిరీల తీరు మారట్లేదు. రద్దీ ఎక్కువగా ఉంటే ప్రాంతాల్లో మహిళలు, యువతుల్ని అసభ్యంగా తాకుతూ రాక్షసానందం పొందుతున్నారు. HYD నుమాయిష్లో ఇలా చేస్తూ 260 మంది పోకిరీలు చిక్కారు. వీరిలో 22 మంది మైనర్లూ ఉండటం గమనార్హం. 188 పోకిరీలకు కౌన్సిలింగ్ ఇవ్వగా, 52 మందికి జరిమానా.. మరో నలుగురికి 2 రోజుల జైలు+జరిమానా విధించారు.
TG: రాష్ట్ర ప్రభుత్వం మూడో డిస్కంను ఏప్రిల్ 1న ప్రారంభించనుంది. సుమారు 30 లక్షల సర్వీస్ కలెక్షన్లతో ఈ డిస్కం ఏర్పాటవగా.. దీనికే వ్యవసాయ ఉచిత విద్యుత్, మెట్రో వాటర్ బోర్డ్, లిఫ్ట్ ఇరిగేషన్ సరఫరాను బదిలి చేసింది. ఇప్పటికే పవర్ అంబులెన్సులతో ఔటేజ్ పునరుద్ధరణ చర్యలు చేపట్టగా.. ఫీడర్ ఔటేజ్ మెనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా రియల్ టైమ్ మానిటరింగ్ ఏర్పాటుచేసింది.
జింబాబ్వేపై విజయంతో భారత్ T20 WC సెమీస్ ఆశలను నిలుపుకుంది. అయితే అసలు డేంజర్ ముందే ఉంది. దూకుడుగా ఆడుతున్న విండీస్పై మార్చి 1న గెలిస్తేనే భారత్ సెమీస్కు చేరుతుంది. ఇరుజట్లకూ కీలకమైన ఈ ‘డూ ఆర్ డై’ మ్యాచ్ వర్షంతో రద్దయితే.. మెరుగైన రన్రేట్ కలిగిన విండీస్ ముందుకు వెళ్తుంది. ఇలా ఓడినా, వర్షం పడినా డిఫెండింగ్ ఛాంప్ భారత్ ఖాళీ చేతులతో నిష్క్రమించాల్సిందే.
AP: అనంతపురం జిల్లా బసంపల్లిలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. సమీప అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఎలుగు స్థానిక పొలాల్లో సంచరిస్తోంది. ఈ క్రమంలో దాన్ని చూసిన స్థానికులు, రైతులు పరుగులు తీశారు. ఎలుగును పట్టుకుని ఇక్కడి నుంచి తరలించాని అటవీ అధికారులను కోరుతున్నారు. ఇటీవల కాలంలో అడవి జంతువుల సంచారం పెరిగిందని, దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
జింబాబ్వేతో జరిగిన సూపర్ 8 మ్యాచులో భారత్ 72 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. 257 పరుగుల లక్ష్యఛేదనలో జింబాబ్వే 184/7కే పరిమితమైంది. ఆ టీమ్ తరఫున బెనెట్ 97* పరుగులతో పోరాడినా ఫలితం లేకపోయింది. మన బౌలర్లలో అర్ష్దీప్ 3 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ విజయంతో సూర్యసేనకు సెమీస్ ఆశలు సజీవం కాగా.. జింబాబ్వే టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ప్రస్తుతం స్మార్ట్ఫోన్ వ్యసనం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఫ్రెండ్ షిప్ రిసెషన్ ఏర్పడుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో వందలాదిగా ఉన్న స్నేహితులు నేడు ఒక్కరికి పరిమితమయ్యారు. దేశంలో 15% మందికి అసలు స్నేహితులే లేకపోవడం ఆందోళనకరం. ఈ ఒంటరితనం తీవ్రమైన డిప్రెషన్కు దారితీస్తోంది. సోషల్ మీడియాలో కాకుండా నిజజీవితంలో స్నేహాలను పెంచుకోవడం మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరం.
టీ20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్లో జింబాబ్వే 15 ఓవర్లకు 131/2 పరుగులు చేసింది. బెన్నెట్ 78*, రజా 19* క్రీజులో ఉన్నారు. మరుమని 20, మయర్స్ 6 పరుగులు చేశారు. భారత బౌలర్లలో వరుణ్, అక్షర్ చెరో వికెట్ తీశారు. జింబాబ్వే విజయ లక్ష్యం 257 రన్స్.
ELR: మార్చి నెల పెన్షన్ను ఒకరోజు ముందుగా ఫిబ్రవరి 28వ తారీఖున పంపిణీ చేయడం జరుగుతుందని కలెక్టర్ వెట్రి సెల్వి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2,57,658 మంది పింఛన్ దారులకు 113.09 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. 28వ తేదీన తీసుకోని వారికి 2న పంపిణీ చేస్తారన్నారు.