KRNL: ఖండేరి వీధికి చెందిన మనోహర్ (40) హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 22న పాత బస్టాండ్ సమీపంలోని బార్ వద్ద జరిగిన గొడవలో తెలుగు నగేశ్, తెలుగు రాజు, ఎరుకలి రాముడు, తెలుగు ఈరన్న కత్తులు, కర్రలతో దాడి చేసి హత్య చేసినట్లు డీఎస్పీ జె. బాబు ప్రసాద్ తెలిపారు. నిందితుల నుంచి ఆటో, రెండు కత్తులు స్వాధీనం చేసి రిమాండ్కు పంపారు.