VZM: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గురుకులంలో 5వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశానికి మార్చి 1న ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ కె. ఉషారాణి తెలిపారు. 1న ఆదివారం 5వ తరగతికి ఉదయం 9.30 నుండి 11.00 గంటల వరకూ అలాగే జూనియర్ ఇంటర్మీడియట్ 12 నుంచి మధ్యాహ్నం 1.30 గంటలు వరకూ ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.
TG: గత పదేళ్ల BRS పాలనపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులపై KTR, హరీష్ రావు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం పేరుతో గత పాలకులు జేబులు నింపుకున్నారని, 1.08 లక్షల కోట్లు ఖర్చు చేసినా కేవలం 110TMCలే అందుబాటులోకి వచ్చాయని విమర్శించారు. ఎనిమిదో వింతగా చెప్పుకున్న ప్రాజెక్టు పేక మేడలా కూలిపోయిందని ఎద్దేవా చేశారు.
SKLM: జిల్లాలో వెట్టి చాకిరీని పూర్తిగా రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. వెట్టిచాకిరీ వ్యవస్థ నిర్మూలన చట్టం అమలులోకి వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం జిల్లా కోర్టు ఆవరణలో అవగాహన పోస్టర్లను ఆవిష్కరించి, సంచార వాహనాన్ని ప్రారంభించారు. ఇందులో సీనియర్ న్యాయవాదులు ఉన్నారు.
E.G: సీఎం చంద్రబాబు గురువారం అమరావతి నుంచి తూ.గో, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలులతో కల్తీ పాలు, కలుషిత జలాల పరిస్థితిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం క్షేత్ర స్థాయిలో ప్రస్తుత పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తత కలిగి ఉండాలన్నారు. స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కీర్తి చేకూరి పాల్గొన్నారు.
MNCL: గోదావరి పుష్కరాల నిర్వహణకు పూర్తి కార్యచరణ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం నస్పూర్లోని కలెక్టరేట్లో సీపీ అంబర్ కిషోర్ ఝా, డీసీపీ భాస్కర్, అదనపు కలెక్టర్ చంద్రయ్య, ఇతర అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని గోదావరి నది తీర ప్రాంతాలలో పుష్కర ఘాట్ల ఏర్పాట్లకు కార్యచరణ సిద్ధం చేయాలన్నారు.
MDK: రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తున్న వ్యవసాయ పరికరాలను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ ఏడీ పుణ్యవతి పేర్కొన్నారు. మాసాయిపేట మండలానికి మంజూరైన మూడు స్పేయర్లు, మూడు రోటవేటర్లను మండల వ్యవసాయధికారి కవితతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ప్రభుత్వం వ్యవసాయం ప్రోత్సహించడానికి సబ్సిడీ పరికరాలను అందజేస్తున్నట్లు తెలిపారు.
BHNG: పాఠశాల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని జూకంటి బాబు ఫౌండేషన్ అధ్యక్షులు జూకంటి బాబు తెలిపారు. గురువారం ఆలేరు మండలం టంగుటూరు గ్రామం ఎలగందుల రాజ్యలక్ష్మి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు నాలుగు ఆకర్షణీయమైన రంగులతో కూడిన యూనిఫామ్లను ఆయన అందజేశారు. విద్యార్థుల భవిష్యత్తు బలోపేతానికి తమ ఫౌండేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.
PLD: శాసనసభ సందర్శనలో భాగంగా ఈపూరు మండలం బొగ్గరం జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు గురువారం అసెంబ్లీకి విచ్చేశారు. వారికి ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సాదరంగా స్వాగతం పలికి, విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ప్రజా సమస్యలపై సభలో చర్చలు ఎలా జరుగుతాయో వివరించిన ఆయన, విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు.
KDP: జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న డ్రైవింగ్ స్కూల్స్పై రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి చర్యలు చేపట్టాలని DYFI జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్ డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. కొన్ని స్కూల్స్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, అనుభవం లేని బోధకులు ఉండడం, ట్రాఫిక్ నియమాలపై సరైన అవగాహన కల్పించకపోవడం జరుగుతోందని ఆరోపించారు.
ADB: శాంతి భద్రతల పరిరక్షణలో రూరల్ SI విష్ణువర్ధన్ పాత్ర కీలకం అని SP అఖిల్ మహాజన్ తెలిపారు. ఆదివాసీల అభివృద్ధి, విద్యార్థులకు పరీక్ష సామాగ్రి, క్రీడారంగంలో అభివృద్ధి చెందడానికి విష్ణువర్ధన్ సేవలు మరువలేనివని అన్నారు. ఈ మేరకు మహిళా క్రీడాకారులకు ఆర్చరీ కిట్లు, ఎనిమిది మంది క్రీడాకారులకు ట్రాక్ సూట్స్ SP అఖిల్ మహాజన్ చేతుల మీదుగా గురువారం అందజేశారు.
E.G: అమరావతిలో CM చంద్రబాబును కొవ్వూరు MLA ముప్పిడి వెంకటేశ్వరరావు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు 2027 గోదావరి పుష్కరాలు దృష్ట్యా కొవ్వూరులోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నిర్మించాలని, ప్రభుత్వ ఆసుపత్రి 50 పడకల నుండి 150 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని కోరారు. 5 ఎత్తి పోతల పథకాలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు అందించారు.
షార్ట్ వీడియోలు చూడటం అలవాటు పడిన వారి మెదడులో దృష్టిని కేంద్రీకరించే భాగాలు నెమ్మదిగా పనిచేస్తున్నట్లు తెలిసింది. ఏదైనా పని మీద దృష్టి పెట్టి చేయాలన్నా లేదా దృష్టిని మళ్ళీ పని మీదకు మళ్ళించాలన్నా మెదడు చాలా ఇబ్బంది పడుతోంది. వీడియోలు చూస్తూ ఆపలేకపోవడం వల్ల మెదడులో సెల్ఫ్ కంట్రోల్ శక్తి తగ్గుతోంది.
GNTR: తుళ్లూరు స్కిల్ హబ్లో గురువారం నిర్వహించిన జాబ్ మేళా ద్వారా 104 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. సుమారు 500 పోస్టుల భర్తీకి నిర్వహించిన ఈ మేళాలో మరో 31 మంది తదుపరి రౌండ్లకు ఎంపికైనట్లు అధికారులు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు ఏపీసీఆర్డీఏ (APCRDA) అధికారులు నియామక పత్రాలను అందజేశారు.
PDPL: పెద్దపల్లి జిల్లా మంథనిలో శకుంతలోపాఖ్యానం ప్రవచనాలకు విశేష స్పందన లభిస్తోంది. వివిధ మండలాలు, ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున హాజరవుతున్నారు. గరికిపాటి ప్రవచనాలు వినేందుకు తొలిరోజు వేసిన 2500 కుర్చీలు సరిపోలక, రెండో రోజు 600 అదనంగా ఏర్పాటు చేశారు. గురువారం చివరి రోజు కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముంది.
ప్రకాశం: ఒంగోలులో పాల డైరీలపై గురువారం అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ బి. వేణుగోపాలరావు, ఫుడ్ సేఫ్టీ అధికారి శంషాఖాన్, శివతేజ అకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పాలలో కల్తీ జరుగుతోందన్న ఆరోపణలతో ఈ తనిఖీలు నిర్వహించామన్నారు. అలాగే తాళ్లూరు మండలం సోమవరప్పాడులో కూడా తనిఖీ చేసి, పాల నమూనాలను సేకరించామని అధికారులు తెలిపారు.