PLD: శాసనసభ సందర్శనలో భాగంగా ఈపూరు మండలం బొగ్గరం జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు గురువారం అసెంబ్లీకి విచ్చేశారు. వారికి ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సాదరంగా స్వాగతం పలికి, విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ప్రజా సమస్యలపై సభలో చర్చలు ఎలా జరుగుతాయో వివరించిన ఆయన, విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు.