GNTR: తుళ్లూరు స్కిల్ హబ్లో గురువారం నిర్వహించిన జాబ్ మేళా ద్వారా 104 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. సుమారు 500 పోస్టుల భర్తీకి నిర్వహించిన ఈ మేళాలో మరో 31 మంది తదుపరి రౌండ్లకు ఎంపికైనట్లు అధికారులు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు ఏపీసీఆర్డీఏ (APCRDA) అధికారులు నియామక పత్రాలను అందజేశారు.