PDPL: పెద్దపల్లి జిల్లా మంథనిలో శకుంతలోపాఖ్యానం ప్రవచనాలకు విశేష స్పందన లభిస్తోంది. వివిధ మండలాలు, ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున హాజరవుతున్నారు. గరికిపాటి ప్రవచనాలు వినేందుకు తొలిరోజు వేసిన 2500 కుర్చీలు సరిపోలక, రెండో రోజు 600 అదనంగా ఏర్పాటు చేశారు. గురువారం చివరి రోజు కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముంది.