ప్రకాశం: ఒంగోలులో పాల డైరీలపై గురువారం అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ బి. వేణుగోపాలరావు, ఫుడ్ సేఫ్టీ అధికారి శంషాఖాన్, శివతేజ అకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పాలలో కల్తీ జరుగుతోందన్న ఆరోపణలతో ఈ తనిఖీలు నిర్వహించామన్నారు. అలాగే తాళ్లూరు మండలం సోమవరప్పాడులో కూడా తనిఖీ చేసి, పాల నమూనాలను సేకరించామని అధికారులు తెలిపారు.