MNCL: గోదావరి పుష్కరాల నిర్వహణకు పూర్తి కార్యచరణ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం నస్పూర్లోని కలెక్టరేట్లో సీపీ అంబర్ కిషోర్ ఝా, డీసీపీ భాస్కర్, అదనపు కలెక్టర్ చంద్రయ్య, ఇతర అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని గోదావరి నది తీర ప్రాంతాలలో పుష్కర ఘాట్ల ఏర్పాట్లకు కార్యచరణ సిద్ధం చేయాలన్నారు.