MDK: రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తున్న వ్యవసాయ పరికరాలను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ ఏడీ పుణ్యవతి పేర్కొన్నారు. మాసాయిపేట మండలానికి మంజూరైన మూడు స్పేయర్లు, మూడు రోటవేటర్లను మండల వ్యవసాయధికారి కవితతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ప్రభుత్వం వ్యవసాయం ప్రోత్సహించడానికి సబ్సిడీ పరికరాలను అందజేస్తున్నట్లు తెలిపారు.