KNL: కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎంపీపీ బుగ్గన నాగభూషణ్ రెడ్డి నగర్ పంచాయతీ చైర్మన్ చలం రెడ్డి వైసీపీ నాయకులు బాబుల్ రెడ్డి, ముర్తు జావలి, నాగరాజు, రామచంద్రుడు అన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు అన్నదాతకు వైసీపీ అండగా జిల్లా కేంద్రమైన నంద్యాలలో చేపట్టిన ధర్నా కార్యక్రమానికి బేతంచర్ల నుంచి భారీగా వెళ్లారు.
HYD: దూల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్ది నెలలుగా గంజాయి విక్రయ కేసులో ప్రమేయం ఉన్న అంగూరి బాయిని విశ్వసనీయ సమాచారం మేరకు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితురాలిపై నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసు నమోదైనట్లు చెప్పారు.
TG: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి సాగుకు నీటిని మంత్రి విడుదల చేయనున్నారు. అనంతరం ఆయన శ్రీరామ్సాగర్ ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఆ తర్వాత శ్రీరామ్సాగర్ ప్రాజెక్టుపై అధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించనున్నారు.
RR: చంపాపేట డివిజన్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి సూచించారు. డివిజన్ పరిధిలోని బైరామల్ గూడా ఓల్డ్ బస్తీలో కొనసాగుతున్న సీసీ రోడ్డు పనులను శుక్రవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించేలా సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తుండాలని కోరారు.
హీరో గోపీచంద్తో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మరో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో 2010లో ‘గోలీమార్’ మూవీ వచ్చింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించాలని పూరీ భావిస్తున్నారట. ‘గోలీమార్’ చుట్టూ కొత్త కథను నడపొచ్చని అనుకుంటున్నారట. ఇక ఈ సినిమాను బెల్లంకొండ సురేష్ నిర్మించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి.
హీరో గోపీచంద్తో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మరో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో 2010లో ‘గోలీమార్’ మూవీ వచ్చింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించాలని పూరీ భావిస్తున్నారట. ‘గోలీమార్’ చుట్టూ కొత్త కథను నడపొచ్చని అనుకుంటున్నారట. ఇక ఈ సినిమాను బెల్లంకొండ సురేష్ నిర్మించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి.
TG: భూదాన్ భూముల కుంభకోణం కేసులో ఈడీ అధికారులు నలుగురుకి నోటీసులిచ్చారు. నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, వంశీరాం బిల్డర్స్ సుబ్బారెడ్డికి నోటీసులు జారీ చేశారు. వారితో పాటు మరో ఇద్దరికి నోటీసులు పంపారు. ఈ నెల 16న విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే IAS అమోయ్ను ఈడీ పలుమార్లు విచారించింది.
ఇస్తాంబుల్ విమానాశ్రయంలో 400 మంది ప్రయాణికులు చిక్కుకున్నారు. తుర్కీయే నుంచి ఢిల్లీ, ముంబైకి రావాల్సిన రెండు ఇండిగో విమానాలు ముందస్తు సమాచారం లేకుండా రద్దవడంతో ఇస్తాంబుల్ విమానాశ్రయంలో ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఆహారం, వసతులు లేక ఇబ్బందిపడినట్లు ప్రయాణికులు ఎక్స్లో పోస్ట్లు చేస్తున్నారు.
NLG: మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి 53.93 క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 644.48 అడుగులుగా ఉంది. మూసీ ప్రాజెక్టు పూర్తి నీటిమట్ట సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.33 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్ట్ అధికారి మధు తెలిపారు.
HYD: కిషన్బాగ్ డివిజన్ పరిధిలో వీధి దీపాల సమస్య రోజురోజుకు పెరుగుతోంది. ఎంఎం పహాడ్ నుంచి పాకీజా హోటల్కు వెళ్లే మార్గంలో పది రోజులుగా అభివృద్ధి దీపాలు వెలగట్లేదు. దీంతో ఆ మార్గంలో వెళ్లాలంటే భయంగా మారింది. వీధి దీపాలు లేక రాత్రిపూట చిన్నపాటి ప్రమాదాలు కూడా జరిగాయని స్థానికులు తెలిపారు. వ్యాపారాలు చేసుకునే వారికి సైతం ఇబ్బందిగా మారింది.
అనంతపురం: గుత్తి ఆర్ఎస్లో శుక్రవారం పోలీసులు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అనుమానితుల ఇళ్లలో తనిఖీలను నిర్వహించామన్నారు. నాటు సారా, కర్ణాటక మద్యం నిల్వ ఉంచి విక్రయిస్తే చర్యలు తప్పవని కాలనీవాసులు హెచ్చరించారు. గొడవలు లేకుండా ప్రశాంతంగా జీవించాలని సూచించారు.
NLG: నల్గొండ జిల్లా DRDA, SERP ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులు తయారు చేస్తున్న తేనె, మిల్లెట్స్, వివిధ రకాల పచ్చళ్లు, పూసలతో తయారు చేస్తున్న ఉత్పత్తులు అభినందనీయమని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లా కలెక్టరేట్లో గురువారం మహిళా సంఘాల ఉత్పత్తులను ఆమె పరిశీలించారు.
W.G: రైతు భరోసా, ఉచిత పంటల భీమా, ధాన్యం కొనుగోలులో అక్రమాలు తదితర అంశాలపై వైసీపీ చేపట్టిన పోరుబాట కార్యక్రమంలో భాగంగా భీమవరం కలెక్టరేట్ ఎదుట శుక్రవారం చేపట్టనున్న ధర్నా కార్యక్రమానికి తణుకు నియోజవర్గం నుంచి వైసీపీ నేతలు, రైతులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ మేరకు వైసీపీ శ్రేణులు వాహనాల్లో తరలి వెళ్లారు.
ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ కేంద్రమంత్రులతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ను కలవనున్నారు. అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై చర్చించనున్నారు. అనంతరం అధిష్టానం పెద్దలను సీఎం కలిసే అవకాశం ఉంది.
HYD: ఎస్ఆర్నగర్ పరిధిలోని శ్రీనివాసకాలనీ ఈస్ట్ కమాన్ వద్ద డ్రైనేజీ, సీవరేజ్ లైన్స్ పొంగిపొర్లుతున్నాయి. దీంతో రోడ్లపై మురుగునీరు నిలిచి ఇబ్బందిగా మారుతుంది. స్థానిక వ్యాపారులకు దుర్వాసన వచ్చి ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఎన్నోసార్లు జీహెచ్ఎంసీ దృష్టికి తీసుకెళ్లిన సిబ్బంది మాత్రం స్పందించడం లేదని వాపోయారు. ఇకనైనా స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరారు.