ASR: దేవుడి పేరును రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తూ హిందూ భక్తుల మనోభావాలను వైసీపీ నాయకులు దెబ్బతీస్తున్నారని జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ మండిపడ్డారు. ఈమేరకు సోమవారం అనంతగిరి మండలం గుమ్మా పంచాయితీలో శ్రావణ్ కుమార్ విలేకర్లతో మాట్లాడారు. టీటీడీలో వైసీపీ హాయాంలో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు.
TG: రాష్ట్ర ఉద్యమకారులకు సంబంధించి ‘అభయహస్తం’ పథకం అమలుపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం.. 8 వారాల్లోగా ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇళ్ల స్థలం, నెలకు రూ.25,000 పెన్షన్ అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ హామీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆరోపిస్తూ పలువురు ఉద్యమకారులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
WGL: ఖానాపురం(మం) అయోధ్యనగర్లో గౌడ సంఘం కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గౌడ సంఘ అభివృద్ధికి తాను ప్రత్యేక కృషి చేస్తానని, కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
కోనసీమ: కర్నూలు జిల్లాలో న్యాయవాది పవన్ కుమార్పై జరిగిన దాడిని ఆలమూరు బార్ అసోసియేషన్ సభ్యులు తీవ్రంగా ఖండించారు. కర్నూలు పోలీస్ స్టేషన్లో సిఐ విక్రమసింహ న్యాయవాది పవన్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దాడి చేసిన ఘటన న్యాయవర్గాలను కలిచివేసిందని వారు పేర్కొన్నారు. సోమవారం న్యాయవాది వేమగిరి నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఆలమూరు కోర్టులో విధులు బహిష్కరించారు.
PDPL: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే, త్వరగా పరిష్కరించే విధంగా చూడాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన దరఖాస్తులు స్వీకరించారు. అక్రమ నిర్మాణాలు, భూమి సమస్యలకు సంబంధించి దరఖాస్తులు ఎక్కువగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణు, అధికారులు పాల్గొన్నారు.
సిద్దిపేట స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో సోమవారం వార్షిక క్రీడా పోటీలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించారు. క్రీడలను ప్రారంభించిన అనంతరం ఆమె ప్రసంగించారు. ఇటీవల రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో జిల్లా పోలీసులు ప్రతిభకనబరచడం అభినందనీయమన్నారు.
SKLM: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ విన్నా ‘ సేవ్ పునర్విక ‘అంటూ వినిపిస్తోంది. కర్నూలుకు చెందిన చిన్నారి పునర్విక ప్రాణాలు కాపాడటానికి సోషల్ మీడియా మొత్తం ఏకమైంది. రూ.16కోట్ల విలువ చేసే ఇంజెక్షన్ కోసం ఫండ్ రైజ్ చేసే పనిలో ఉన్నారు. ఈమేరకు మందస మండలానికి చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, యువత స్పందించారు. పునర్విక కోసం విరాళాలు సేకరణ సోమవారం ప్రారంభించారు.
BHNG: మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే సామేలు అన్నారు. సోమవారం మోత్కూర్ మండలంం దాచారంలో మహిళా సంఘాల సమైక్య భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. అనంతరం జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు.
స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఈనెల 26న వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, వీరిద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఎంత ఉండవచ్చు? అని అభిమానులు నెట్టింట్లో చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం విజయ్ వయసు 36 ఏళ్లు కాగా, రష్మిక వయసు 30 ఏళ్లు. వీరి మధ్య ఆరేళ్ల వ్యత్యాసం ఉంది. వయసులో పెద్దగా తేడా లేకపోవడంతో వీరిద్దరూ ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అని కామెంట్లు చేస్తున్నారు.
RR: పంట నమోదు, ఫార్మర్ రిజిస్ట్రేషన్ పకడ్బందీగా నిర్వహించాలని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వ్యవసాయ విస్తరణ అధికారులు వాలంటీర్ల సహాయంతో గ్రామాల్లోకి వెళ్లి పంటలను నమోదు చేయాలని కోరారు. అదేవిధంగా యూరియా కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
NZB: జోగులాంబ గద్వాల జిల్లా నుంచే తాను కొత్త పార్టీ పెడతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి ఆధ్వర్యంలో గద్వాలలో నిర్వహించిన రైతు సంఘర్షణ సభలో సోమవారం ఆమె మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏది జరిగిన ఉత్తర తెలంగాణలోని కరీంనగర్లో ప్రారంభం అయ్యేదని కవిత గుర్తు చేశారు.
NZB: బోధన్ మున్సిపల్ ఎన్నికలు సజావుగా నిర్వహించినందుకు మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణను నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి అభినందించారు. ఎన్నికలను పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించడంలో కమిషనర్ చేసిన కృషిని కలెక్టర్ ప్రశంసించారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నఅధికారుల సమన్వయం, క్రమశిక్షణతో కూడిన చర్యలు, ప్రజల సహకారం వల్ల ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయన్నారు.
NLG: తెలంగాణ ఉద్యమ నేత కూనూరు సంజయ్ దాస్ గౌడ్ తన సేవాభావాన్ని చాటుకున్నారు. చిట్యాల జి.ప.ఉ. పాఠశాలలో టెన్త్ పరీక్ష ఫీజు కట్టలేని 39 మంది విద్యార్థుల ఫీజును ఆయనే స్వయంగా చెల్లించారు. చదువుకు పేదరికం అడ్డుకాకూడదనే ఈ సాయం చేసినట్లు ఆయన తెలిపారు. హెచ్ఎం సుశీల, ఉపాధ్యాయులు చిలక రాజు శ్రీనివాస్, నర్రా సరళ పాల్గొని సంజయ్ దాస్ సేవలను అభినందించారు.
JGL: భీమారం మండలం గోవిందారం గ్రామంలో రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న గ్రామ మహిళా సమైక్య భవనానికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సోమవారం శంకుస్థాపన చేశారు. తమ ప్రభుత్వ హయాంలో మహిళలు అన్ని రంగాల్లో ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. మహిళా సాధికారతకు భవన నిర్మాణాలు దోహదపడతాయని పేర్కొన్నారు.
కాకినాడ: వన్ టౌన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 21 మంది పట్టుబడినట్లు CI నాగదుర్గారావు తెలిపారు. వారిని సోమవారం కాకినాడ SJSC మేజిస్ట్రేట్ సీహెచ్ ఎస్ వీవీ ఎన్ శేషారావు ముందు హాజరుపరిచారు. విచారణ అనంతరం 13 మందికి ఒక్కొక్కరికి రూ. 10 వేల జరిమానా విధించారు. మిగిలిన 8 మందికి రెండు నుంచి మూడు రోజుల జైలు శిక్ష విధిస్తూ మేజిస్ట్రేట్ తీర్పునిచ్చారు.